ChatGPT Go: ఓపెన్‌ఏఐ ఆఫర్‌.. భారత్‌లో ఉచితంగా ‘చాట్‌జీపీటీ గో’

Eenadu icon
By Business News Team Published : 28 Oct 2025 11:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్‌ఏఐ ఇటీవల ‘చాట్‌జీపీటీ గో’ పేరుతో భారత్‌లో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ సేవలకు సంబంధించి దేశీయ యూజర్లకు తాజాగా ఆఫర్‌ ప్రకటించింది. వచ్చే నెల నుంచి ఏడాది పాటు ‘చాట్‌జీపీటీ గో (ChatGPT Go)’ ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది.

‘‘నవంబరు 4 నుంచి లిమిటెడ్‌ టైం ప్రమోషనల్‌ పీరియడ్‌ అందుబాటులోకి రానుంది. భారత్‌లోని యూజర్లందరికీ ‘చాట్‌జీపీటీ గో’ను ఏడాది పాటు ఉచితంగా అందించనున్నాం. కొత్త వినియోగదారులతో పాటు ఇప్పటికే ఉన్న చాట్‌జీపీటీ గో సబ్‌స్క్రైబర్లకూ ఈ ఉచిత ఆఫర్‌ వర్తించనుంది’’ అని ఓపెన్ఏఐ (OpenAI) కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది ఆగస్టులో ‘చాట్‌జీపీటీ గో (ChatGPT Go)’ సేవలు భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఉచిత ప్లాన్‌తో పోలిస్తే చాట్‌జీపీటీ గోలో సందేశాల పరిమితి, ఇమేజ్‌ జనరేషన్, ఫైల్‌ లేదా ఇమేజ్‌ అప్‌లోడ్‌లు 10 రెట్లు ఎక్కువగా ఉండనున్నాయి. మెమొరీ కూడా ఉచిత ప్లాన్‌తో పోలిస్తే రెండింతలు అధికంగా ఉండనుంది. సేవలు ప్రారంభించిన సమయంలో ‘చాట్‌జీపీటీ గో’కు రూ.399 నెలవారీ ఛార్జీలను ప్రకటించారు. తాజాగా మరింత మంది యూజర్లను ఆకట్టుకునేందుకు ఏడాది పాటు ఉచిత ఆఫర్‌ను తీసుకొచ్చారు. ఇక, ఇప్పటికే రూ.1999తో చాట్‌జీపీటీ ప్లస్‌ ప్లాన్‌ కొనసాగుతోంది. దీంతో పాటు నిపుణులు, సంస్థల కోసం ఇప్పటికే ప్రో ప్లాన్‌కు రూ.19,900తో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను ఓపెన్‌ ఏఐ అందిస్తోన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు