Saudi Arabia’s flyadeal: భారత్కు సౌదీ అరేబియా ఫ్లైయెడీల్ విమానాలు
2026 తొలి త్రైమాసికం నుంచి..

దిల్లీ: వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన విపణిపై ఆశతో, సౌదీ అరేబియాకు చెందిన ఫ్లైయెడీల్ 2026 తొలి త్రైమాసికం నుంచి ముంబయితో పాటు మన దేశంలోని పలు నగరాలకు విమానాలను ప్రారంభించనుంది. ప్రపంచంలోనే అత్యంత పోటీ ఉన్న మార్కెట్లలో భారత్ ఒకటని, అక్కడ వెచ్చించే ప్రతి రూపాయిపై జాగ్రత్తగా దృష్టి సారించాల్సి ఉంటుందని విమానయాన సంస్థ సీఈఓ స్టీవెన్ గ్రీన్వే పీటీఐకి తెలిపారు. జెడ్డాలో ఉన్న సౌదియా ఎయిర్లైన్స్కు అనుబంధంగా ఉన్నఫ్లైయెడీల్ 8 ఏళ్లుగా లాభదాయకంగా విమానాలను నడుపుతోంది. ఈ ఏడాది ఆఖరుకు సంస్థ వద్ద 46 విమానాలు ఉండాలని ఆశిస్తోంది. ప్రస్తుతం 42 ఎ320 విమానాలను కలిగి ఉంది. 2027 జులై నుంచి ప్రారంభించబోయే 10 పెద్ద విమానాలు ఎ330 నియోలకు కూడా ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చింది. ‘వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో భారత్లో కార్యకలాపాలు ప్రారంభించాలని అనుకుంటున్నాం. ముంబయి, దిల్లీ వంటి నగరాలకు తొలుత విమానాలు నడుపుతాం. అలాగే దేశంలోని రెండో అంచె నగరాలపైనా దృష్టి ఉంటుంది. ముంబయి మాత్రం ప్రాధాన్య జాబితాలో అగ్ర స్థానంలో ఉంటుంద’ని గ్రీన్వే వెల్లడించారు.

కెన్యా, ఈజిప్ట్లకు ఆకాశ ఎయిర్ సర్వీసులు
కెన్యా, ఇథియోపియా, ఈజిప్ట్, ఇతర దేశాలకు విమానాలు నడుపుతామని, బోయింగ్ విమానాల డెలివరీ షెడ్యూల్ చాలా బాగుందని విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దూబే వెల్లడించారు. అంతర్జాతీయ విస్తరణ సరైన మార్గంలో కొనసాగుతోందని, త్వరలో షార్జాకు విమానాలు నడిపే ప్రకటన వస్తుందని తెలిపారు. ఈ సంస్థ వద్ద 30 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఉన్నాయి. ఈ ఏడాది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విమానాలను జత చేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం దోహా (ఖతార్), జెడ్డా, రియాద్ (సౌదీ అరేబియా), అబుధాబి (యూఏఈ), కువైట్ సిటీ (కువైట్), ఫుకెట్ (థాయ్ల్యాండ్)తో పాటు 24 దేశీయ గమ్యస్థానాలకు ఆకాశ ఎయిర్ విమానాలను నడుపుతోంది. ఈ సంస్థలో ప్రస్తుతం 750-775 మంది పైలట్లు ఉన్నారు. 2026లో మరి కొంత మందిని ముఖ్యంగా ఫస్ట్ ఆఫీసర్లను నియమించుకుంటామని దూబే తెలిపారు. 226 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు ఆర్డర్ పెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎతిహాద్ ఎయిర్వేస్తో కోడ్షేర్ భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ వద్ద మూలధనం తగినంత ఉందని, వచ్చే 2-5 ఏళ్లలో ఐపీఓకు వస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


