Stock market: భారీ లాభాల్లో సూచీలు.. మళ్లీ 24,550 ఎగువకు నిఫ్టీ

Eenadu icon
By Business News Team Published : 11 Aug 2025 16:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకులు, ఆటో, రియల్టీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, ఎస్‌బీఐ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 750కి పైగా పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో మళ్లీ 24,550 ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 79,885.36 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,857.79) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో స్వల్ప లాభాల్లో కదలాడిన సూచీ.. క్రమంగా భారీ లాభాల్లోకి వెళ్లింది. ఇంట్రాడేలో 80,636.05 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 746.29 పాయింట్ల లాభంతో 80,604.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 221.75 పాయింట్ల లాభంతో 24,585.05 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.66గా ఉంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో బీఈఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ సుజుకీ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్‌, ఎటెర్నల్‌, ట్రెంట్‌, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 66 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 3,362.26 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని