Stock market: మదుపర్ల లాభాల స్వీకరణ
ప్రైవేట్ బ్యాంకులు, లోహ షేర్లల్లో అమ్మకాలు
రూ.2.10 లక్షల కోట్లు తగ్గిన మదుపర్ల సంపద
ఎఫ్ఐఐ అమ్మకాలు- రూ.6769.34 కోట్లు
డీఐఐ కొనుగోళ్లు- రూ.7068.44 కోట్లు

వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ డీలాపడింది. ప్రైవేట్ రంగ బ్యాంకులు, లోహ, విద్యుత్ రంగ కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ ఇందుకు కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడం ప్రభావం చూపింది. విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఒకపైసా తగ్గి 88.70 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు ధర 0.49% పెరిగి 65.32 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్, దక్షిణ కొరియా మినహా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడయ్యాయి.
బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.2.10 లక్షల కోట్లు తగ్గి రూ.470.26 లక్షల కోట్ల (5.30 లక్షల కోట్ల డాలర్ల)కు పరిమితమైంది.
స్వల్ప నష్టాలతో మొదలై..: బీఎస్ఈ సెన్సెక్స్ (క్రితం ముగింపు 84,404.46) స్వల్ప నష్టంతో 84,379.79 పాయింట్ల వద్ద ఆరంభమైంది. ఆ తర్వాత వెంటనే లాభాల్లోకి వచ్చి 84,712.79 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. అనంతరం మళ్లీ నష్టాల్లోకి జారుకుని, చివరి వరకు అదే ధోరణిలో చలించింది. ఆఖరుకు 465.75 పాయింట్ల నష్టంతో 83,938.71 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 155.75 పాయింట్లు తగ్గి 25,722.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 25,711.20 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని; 25,953.75 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 273.17 పాయింట్లు, నిఫ్టీ 73.05 పాయింట్ల మేర నష్టపోయాయి.
5 మినహా మిగతావి నష్టాల్లో..: సెన్సెక్స్ 30 షేర్లలో 5 మినహా మిగతావి నష్టాల్లో ముగిశాయి. ఎటర్నల్ 3.52%, ఎన్టీపీసీ 2.39%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.66%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.28%, బజాజ్ ఫిన్సర్వ్ 1.25%, పవర్గ్రిడ్ 1.17%, ట్రెంట్ 1.06%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.05% తగ్గాయి. భెల్ 3.95%, ఎల్అండ్టీ 1.09%, టీసీఎస్ 0.73%, ఐటీసీ 0.37%, ఎస్బీఐ 0.31% లాభపడ్డాయి. బీఎస్ఈ రంగాల సూచీల్లో లోహ, విద్యుత్, సేవలు, కమొడిటీస్, మన్నికైన వినియోగ వస్తువులు, ఆర్థిక సేవలు డీలాపడ్డాయి. ఇంధనం, ఇండస్ట్రియల్స్, భారీ యంత్రపరికరాలు, చమురు- గ్యాస్ సూచీలు రాణించాయి.

ఐపీఓ సమాచారం
- ఫిన్బడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు ఇష్యూ ధరగా రూ.140- 142ను నిర్ణయించారు. ఈ ఐపీఓ నవంబరు 6న మొదలై 10న ముగియనుంది. ఫిన్బడ్ ఫైనాన్షియల్లో క్రికెటర్ ధోనికి పెట్టుబడులు ఉన్నాయి.
 - లెన్స్కార్ట్ సొల్యూషన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ మొదటి రోజున 1.13 రెట్ల స్పందన లభించింది. చిన్న మదుపర్ల విభాగంలో 1.31 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. నవంబరు 4న ఇష్యూ ముగియనుంది.
 - ఓర్క్లా ఇండియా ఐపీఓ ముగిసే సరికి 48.73 రెట్ల స్పందన లభించింది. రిటెయిల్ విభాగంలో 7.05 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి.
 - స్టడ్స్ యాక్సెసరీస్ ఐపీఓ రెండో రోజుకు 5.08 రెట్ల స్పందన లభించింది. చిన్న మదుపర్ల విభాగంలో 6.02 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి.
 
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


