ఏ రాష్ట్ర తీరానికో టెస్లా!

అమెరికాకు చెందిన విద్యుత్తు కార్ల దిగ్గజ సంస్థ టెస్లా మనదేశంలో అడుగుపెట్టడానికి రంగం సిద్ధమైంది. ముంబయి, పుణెలలో ఉద్యోగులను నియమించుకునేందుకూ ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో కార్లు దిగుమతి చేసుకుని, ఇక్కడ విక్రయించనుంది. ఆ తర్వాత దేశంలో కార్ల అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనేది టెస్లా ప్రణాళిక. సీకేడీ (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) పద్ధతిలో విడిభాగాలు తీసుకువచ్చి, ఇక్కడ అసెంబుల్ చేసి విక్రయిస్తుందని.. ఆ తర్వాత విడిభాగాలు సహా పూర్తిస్థాయిలో కార్లను మన దేశంలోనే ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉందని తెలుస్తోంది.

పోటీలో 5
రాయితీలే కీలకం
టెస్లా పెద్ద బ్రాండు కావడంతో, ఆ సంస్థను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. టెస్లా యూనిట్ ఏర్పాటైన రాష్ట్రానికి ఇతర విద్యుత్తు వాహన సంస్థలు, బ్యాటరీలు, విడిభాగాల ఉత్పత్తి కంపెనీలు క్యూ కట్టే అవకాశం ఉంది. అందువల్ల విద్యుత్తు వాహనాల రంగంలో కీలకంగా మారి, పెద్ద సంఖ్యలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించొచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన. ఈ రేసులో మహారాష్ట్ర, తమిళనాడు ముందున్నాయని.. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలూ రేసులో ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ వద్ద ఉన్న సదుపాయాలు, తాము కల్పించే రాయితీలు, ప్రోత్సాహకాలు వివరించి టెస్లా యాజమాన్యాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి.
ఏం కావాలి?
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టెస్లా పరిగణనలోకి తీసుకునే అంశాలివీ..
- పోర్టు సదుపాయం తప్పనిసరి. తొలిదశలో కార్లను ఐరోపా లేదా చైనా నుంచి దిగుమతి చేసుకునేందుకు, ఆ తర్వాత విడిభాగాలను దిగుమతి చేసుకుని, ఇక్కడ అసెంబుల్ చేయాలి.
 - బ్యాటరీ, మోటార్ విడిభాగాలు, బాడీ ప్యానెళ్లు తయారు చేసే యూనిట్ల స్థాపనకు అనువైన పరిస్థితులు, వసతులు ఉండాలి.
 - నైపుణ్యం గల మానవ వనరుల లభ్యత.
 - స్థలం, పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు, అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.
 - దేశవ్యాప్తంగా వాహనాల పంపిణీకి అవసరమైన లాజిస్టిక్స్ సదుపాయాలు
 
ఎవరి సత్తా ఎంత?

పోటీపడుతున్న రాష్ట్రాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర అయితే, ప్రభుత్వం పట్టుదలగా ప్రయత్నిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ రాష్ట్రాల్లో స్థితిగతులు చూస్తే..
గుజరాత్: ప్రధాని మోదీ చొరవతో గుజరాత్ నాలుగైదేళ్లలో టాటా మోటార్స్, సుజుకీ మోటార్స్ వంటి అగ్రశ్రేణి సంస్థలను ఆకర్షించింది. రాయితీలు, ప్రోత్సాహకాలతో ఆకట్టుకుంటోంది. ముంద్రా పోర్టు ఉంది. విద్యుత్తు సరఫరా వ్యవస్థ మెరుగుపడినా, మానవ వనరుల కొరత ఉంది.
కర్ణాటక: మహారాష్ట్ర, తమిళనాడుకు తగ్గకుండా కర్ణాటకలోనూ సానుకూల పరిస్థితులున్నాయి. సిలికాన్ వ్యాలీ వంటి బెంగళూరు పెద్ద ఆకర్షణీయ అంశం. టెస్లా అంటే టెక్నాలజీ దిగ్గజం కూడా. టయోటా, వోల్వో వంటి సంస్థలు ఎన్నో ఏళ్లుగా ఈ రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కాకపోతే మంగళూరు పోర్టు అంత అనువైనది కాదనే అభిప్రాయం ఉంది.
తమిళనాడు: ‘భారతదేశపు డెట్రాయిట్’ గా చెన్నైకి పేరుంది. అశోక్ లేలాండ్, ఫోర్డ్, రెనో- నిస్సాన్, హ్యుందాయ్.. తదితర కంపెనీల యూనిట్లు చెన్నై సమీపంలో ఉన్నాయి. ఆటోమొబైల్ సప్లయర్ నెట్వర్క్ పెద్దది. మానవ వనరుల కొరత లేదు. చెన్నై, ఎన్నోర్ పోర్టుల ద్వారా దిగుమతులు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు సానుకూలంగా ఉంటుంది.
మహారాష్ట్ర: పారిశ్రామికీకరణ అధికం. వాహన పరిశ్రమకు కేంద్ర స్థానం. ముంబయి ఆర్థిక రాజధాని కాగా, పుణె ఆటోమొబైల్ కేంద్రం. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్, కైనెటిక్, టాటా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థలున్నాయి. ముంబయిలోని పోర్టు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు సానుకూలతలే. కాకపోతే భూముల ధర ఎంతో ఎక్కువ. కార్మిక వ్యయాలూ అధికమే.
ఆంధ్రప్రదేశ్: అతిపెద్ద తీరప్రాంతం, విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు నాలుగైదు పోర్టులు ఉండటం ఆంధ్రప్రదేశ్కు కలిసొచ్చే అంశం. రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల అత్యంత ముఖ్యాంశం. అన్ని రకాల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి, శరవేగంగా మౌలిక వసతులు కల్పించి.. బెంగళూరు సమీపంలోని అనంతపురం జిల్లాలో కొరియా సంస్థ కియా మోటార్స్ ప్లాంట్ ఏర్పాటయ్యేలా చంద్రబాబు ప్రభుత్వమే గతంలో చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇదే తరహాలో టెస్లా కోరుకున్న సదుపాయాలన్నీ అందించి, ఈ యూనిట్నూ సాధించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. చెన్నైకి సమీపంలోని శ్రీసిటీ సెజ్లో ఇసుజు కార్ల కంపెనీతో పాటు విడిభాగాల సంస్థలు 15 ఉన్నాయి. చెన్నైలోని కార్ల కంపెనీలకు ఇక్కడి నుంచి విడిభాగాలు వెళ్తున్నాయి. ఈ సమీపంలోనే హీరో ప్లాంటు ఉంది.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. - 
                                    
                                        

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి.. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఎప్పుడంటే..: బీసీసీఐ
 - 
                        
                            

అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు..: ప్రకాశ్రాజ్
 - 
                        
                            

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
 - 
                        
                            

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
 - 
                        
                            

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
 - 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 


