ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన కారు.. 10 మంది దుర్మరణం
రోడ్డుపై ఆగివున్న ఆయిల్ ట్యాంకర్ను వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టిన ఘటనలో పది మంది దుర్మరణం చెందారు.
అహ్మదాబాద్: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్- వడోదర ఎక్స్ప్రెస్వేపై ఆగివున్న ఆయిల్ ట్యాంకర్ను వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కారు వడోదర నుంచి అహ్మదాబాద్ వైపు వెళ్తుండగా ఖేదా జిల్లాలోని నాడియాడ్ వద్ద ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు. రోడ్డు పక్కన నిలిపిఉన్న ట్యాంకర్ను వేగంగా ఢీకొట్టడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు విడిచినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై నాడియాడ్ ఎమ్మెల్యే పంకజ్ దేశాయ్ స్పందించారు. సాంకేతికలోపం కారణంగా ట్రక్కు ఎక్స్ప్రెస్వే ఎడమ లేన్లో ఆగిపోయి ఉండొచ్చని కారు డ్రైవర్కు బ్రేకులు వేసేందుకు తగినంత సమయం లభించకపోవడంతో ఢీకొట్టినట్లుగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
మార్కుల మాయాజాలంలో చిక్కిన ఓ కుటుంబం రక్తపు మడుగులో విలవిల్లాడింది. తల్లీకుమార్తెల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలు తీసింది. -
సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కొట్టేశారు.. పోలీసులు 25 నిమిషాల్లోనే రప్పించారు
ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే సైబర్ నేరస్థులు రూ.1.10 కోట్లు కొట్టేశారు. ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న మినీ ట్రక్ను సరకు రవాణా వాహనం ఢీకొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. -
సీఎస్ శాంతికుమారి డీపీతో డబ్బులు డిమాండ్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీపీ(డిస్ప్లే పిక్చర్)ను వినియోగించి సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. -
రాష్ట్ర సరిహద్దులో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య సోమవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. -
వివాహితపై యువకుడి అత్యాచారం
ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటంలో ఆదివారం రాత్రి జరిగింది. -
గుజరాత్ తీరంలో రూ.60 కోట్ల విలువైన హషిష్ స్వాధీనం
గుజరాత్ తీరంలో అధికారులు ఓ పడవలో రూ.60 కోట్ల విలువైన 173 కి.గ్రాముల హషిష్ను స్వాధీనం చేసున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు