Suryapet: కంటైనర్‌లో ఊపిరాడక 16 ఎద్దుల మృత్యువాత.. పోలీసులకు చిక్కిన అక్రమ రవాణా ముఠా

ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న నలుగురు తమిళనాడు వాసులను సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 29 May 2024 15:20 IST

సూర్యాపేట: ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న నలుగురు తమిళనాడు వాసులను సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీటిని తరలిస్తున్న కంటైనర్‌లో ఊపిరాడక 16 ఎద్దులు మృతి చెందినట్లు గుర్తించారు. మరో తొమ్మిదింటిని గోశాలకు తరలించారు. ఒక ఎద్దుకు చికిత్స అందిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట నుంచి ఏపీ వైపు వెళ్తుండగా కంటైనర్ పోలీసులకు పట్టుబడింది. మృతిచెందిన ఎద్దులకు పశువైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు