Murder: ఇద్దరు చిన్నారుల హత్య.. నిందితుడి ఎన్‌కౌంటర్‌

ఇద్దరు చిన్నారులను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేసి హతమార్చారు.

Published : 20 Mar 2024 01:24 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక బాబా కాలనీలోని తమ ఇంట్లో ఆడుకుంటున్న 12, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు అన్నదమ్ములను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వారి గొంతులు కోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కోపోద్రిక్తులైన స్థానికులు.. అక్కడి ఓ దుకాణానికి నిప్పటించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. వారిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు అతడిని ఎన్‌కౌంటర్‌ చేసి హతమార్చారు. నిందితుడిని కూడా స్థానికుడిగానే గుర్తించారు. అయితే, హత్య చేయడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని