Odisha: 11 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం
ఒడిశాలో 11 ఏళ్ల గిరిజన విద్యార్థినిపై ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డారు.
భువనేశ్వర్: ఒడిశా(Odisha)లో దారుణం చోటుచేసుకుంది. 11 ఏళ్ల గిరిజన విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నబరంగ్పుర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని మరుగుదొడ్డిలో ఉండగా పాఠశాల హెడ్ మాస్టర్తోపాటు మరో ఉపాధ్యాయుడు బలవంతంగా గదిలోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్టు చేశారు.
నబరంగ్పుర్ ఎస్పీ రోహిత్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 7 బాలికపై అత్యాచారం జరగగా, రెండురోజుల అనంతరం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు కడుపులో నొప్పిరావడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు లైంగిక దాడి జరిగిందని గుర్తించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు అదేరోజు కుందేయి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక చెప్పిన వివరాల మేరకు పాఠశాల హెడ్మాస్టర్, మరో ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇద్దరు ఉపాధ్యాయులపై ఐపీసీ, పోక్సో చట్టం కింద పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలికకు నబరంగ్పుర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఒడిశా మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నబరంగ్పుర్ జిల్లా మెడికల్ ఆఫీసర్ నుంచి నివేదిక కోరింది. రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ నాలుగువారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాలికకు సరైన వైద్య సదుపాయాన్ని కల్పించాలని స్పష్టం చేసింది. ఇక ఈ విషయంపై ప్రతిపక్షాలు భాజపా, కాంగ్రెస్లు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. మహిళలు, అమ్మాయిలపై రాష్ట్రంలో రోజురోజులకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని తీవ్ర విమర్శలు గుప్పించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం