Odisha: 11 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం
ఒడిశాలో 11 ఏళ్ల గిరిజన విద్యార్థినిపై ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డారు.
భువనేశ్వర్: ఒడిశా(Odisha)లో దారుణం చోటుచేసుకుంది. 11 ఏళ్ల గిరిజన విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నబరంగ్పుర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని మరుగుదొడ్డిలో ఉండగా పాఠశాల హెడ్ మాస్టర్తోపాటు మరో ఉపాధ్యాయుడు బలవంతంగా గదిలోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్టు చేశారు.
నబరంగ్పుర్ ఎస్పీ రోహిత్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 7 బాలికపై అత్యాచారం జరగగా, రెండురోజుల అనంతరం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు కడుపులో నొప్పిరావడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు లైంగిక దాడి జరిగిందని గుర్తించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు అదేరోజు కుందేయి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక చెప్పిన వివరాల మేరకు పాఠశాల హెడ్మాస్టర్, మరో ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇద్దరు ఉపాధ్యాయులపై ఐపీసీ, పోక్సో చట్టం కింద పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలికకు నబరంగ్పుర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఒడిశా మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నబరంగ్పుర్ జిల్లా మెడికల్ ఆఫీసర్ నుంచి నివేదిక కోరింది. రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ నాలుగువారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాలికకు సరైన వైద్య సదుపాయాన్ని కల్పించాలని స్పష్టం చేసింది. ఇక ఈ విషయంపై ప్రతిపక్షాలు భాజపా, కాంగ్రెస్లు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. మహిళలు, అమ్మాయిలపై రాష్ట్రంలో రోజురోజులకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని తీవ్ర విమర్శలు గుప్పించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పుల కారణంగా మానసికంగా కుంగిపోయిన ఓ వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లలను, కన్నతల్లిని కడతేర్చి తానూ ఉరివేసుకుని తనువు చాలించారు. -
ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూఝ్మడ్ అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. -
టమాటా పెట్టెల చాటున తెలంగాణ మద్యం రవాణా
తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న నిందితులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పోలీసులు అరెస్టు చేశారు. -
మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు, ట్రక్కు ఢీ
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఓ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. -
సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి పేరుతో నకిలీ ఖాతాలు
తన పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)