Love marriage: ప్రేమ పెళ్లి విషయంలో ఘర్షణ.. ముగ్గురి మృతి
కొన్ని నెలల క్రితం జరిగిన ప్రేమ వివాహం విషయంలో ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ముగ్గురి ప్రాణాలు బలైపోయాయి.
ముజఫర్నగర్: గతంలో జరిగిన ప్రేమ వివాహం విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర హింసకు దారితీసింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఇరువర్గాల మధ్య జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఫులాత్ గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. రెండు గ్రూపుల మధ్య మంగళవారం చెలరేగిన ఈ ఘర్షణలో అంకిత్ (25), రోహిత్ (29) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరో యువకుడు బుధవారం ప్రాణాలు విడిచాడు.
వివరాల్లోకి వెళ్తే.. అంకిత్ అనే యువకుడు హరిమోహన్ అనే వ్యక్తి కుమార్తెను ఆ కుటుంబానికి ఇష్టం లేకుండా కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ జంట మేరఠ్లో కాపురం పెట్టింది. అప్పట్నుంచి ఇరువర్గాల మధ్య వైరం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో అంకిత్ మంగళవారం ఓ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు మేరఠ్ నుంచి ముజఫర్నగర్ వచ్చాడు. గమనించిన హరిమోహన్ వర్గం యువకుడిపై దాడికి పాల్పడింది. ఈక్రమంలో తుపాకీ కాల్పులు చోటుచేసుకోవడంతో అంకిత్తో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ ఎస్పీ అభిషేక్సింగ్ తెలిపారు. గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తుగానే అక్కడ పోలీసులను మోహరించినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు