Rajasthan: రసాయన పరిశ్రమలో పేలుడు.. ఐదుగురు మృతి

రాజస్థాన్‌లోని ఓ రసాయన పరిశ్రమలో పేలుడు చోటుచేసుకొని ఐదుగురు మృతి చెందారు. 

Published : 24 Mar 2024 00:28 IST

జైపుర్‌: రాజస్థాన్‌ (Rajasthan)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జైపుర్‌ జిల్లాలోని బస్సీ ప్రాంతంలో ఉన్న రసాయన పరిశ్రమలో పేలుడు చోటుచేసుకొని మంటలు చెలరేగడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలోని బాయిలర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా కలెక్టర్‌ ప్రకాశ్‌ రాజ్‌పురోహిత్‌ పేర్కొన్నారు. పేలుడు తీవ్రతకు సంఘటన స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఇద్దరిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స అందిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని