Road Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 

Updated : 25 Apr 2024 16:25 IST

కోదాడ: కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారితో సహా ఆరుగురు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో కారులో పది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు ఘటనాస్థలంలోనే చనిపోయారు. గాయపడిన నలుగురిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

హైదరాబాద్‌లో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన వీరంతా చిన్నారి చెవులు కుట్టించేందుకు గురువారం ఉదయం విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు.. కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జల్లా శ్రీకాంత్, లాస్య, ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన  కృష్ణంరాజు, మాణిక్యమ్మ, చంద్రరావు, స్వర్ణగా గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని