Delhi: బేబీకేర్ ఆసుపత్రిలో అగ్గి
ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రే వారి పాలిట మృత్యుపాశమైంది. అకస్మాత్తుగా ఎగసిన మంటలు ఏడుగురు నవజాత శిశువులకు మరణ శాసనం లిఖించాయి. కన్నతల్లులకు కడుపుకోత మిగిల్చిన ఈ విషాద ఘటన దిల్లీలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది.
ఏడుగురు శిశువుల దుర్మరణం
దిల్లీలో దుర్ఘటన
దిల్లీ: ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రే వారి పాలిట మృత్యుపాశమైంది. అకస్మాత్తుగా ఎగసిన మంటలు ఏడుగురు నవజాత శిశువులకు మరణ శాసనం లిఖించాయి. కన్నతల్లులకు కడుపుకోత మిగిల్చిన ఈ విషాద ఘటన దిల్లీలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. పరారైన హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ నవీన్ కిచిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఆసుపత్రికి ఇచ్చిన అనుమతుల గడువు మార్చి 31న ముగిసినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాన్ని నిర్వాహకులు పొందలేదనీ తెలిసింది. అక్కడి వైద్యుల అర్హతలపైనా అధికారులు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న డాక్టర్ ఆకాశ్నూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తూర్పు దిల్లీలోని వివేక్ విహార్లో ఇరుకైన వీధిలో ఉన్న బేబీకేర్ హాస్పిటల్లో వివిధ రుగ్మతలతో వచ్చిన నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు. అందరూ నెల రోజుల లోపు వయసు వారే. శనివారం రాత్రి ఒక్కసారిగా పెద్ద శబ్దం... ఆ వెంటనే ఉవ్వెత్తున మంటలు వ్యాపించాయి. కాలనీవాసులు పరుగున వచ్చి భవనం వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా స్థానిక స్వచ్ఛంద సంస్థ షహీద్ సేవా దళ్ కార్యకర్తలు 12 మంది చిన్నారులను సమీపంలోని మరో ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఆరుగురు ఆ తర్వాత తుది శ్వాస విడిచారు. మిగిలిన అయిదుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే వైద్య సిబ్బంది పరారయ్యారని స్థానికులు ఆరోపించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లను అక్రమ పద్దతుల్లో రీఫిల్లింగ్ చేస్తున్నారని స్థానికుడు ఒకరు వెల్లడించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు ఎగిశాయని ప్రాథమికంగా భావిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సురేంద్ర చౌధరి వెల్లడించారు. ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో పక్కపక్కనే ఉన్న రెండు భవనాలు ధ్వంసమయ్యాయని దిల్లీ అగ్నిమాపక విభాగ అధికారి రాజేంద్ర పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై దిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించింది.
రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారులు చనిపోవటం మనసును కలవరానికి గురిచేసిందని తెలిపారు. చికిత్స పొందుతున్న చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేల చొప్పున అందజేయనున్నారు. అగ్ని ప్రమాదం కారణాలపై విచారణ జరుపుతున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని దిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. చిన్నారుల మృతి, అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్ ప్రియాంక్ కనూంగో తెలిపారు.
మరో ఘటనలో ముగ్గురి మృతి
తూర్పుదిల్లీలోని కృష్ణానగర్లో శనివారం అర్ధరాత్రి నాలుగు అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగాయి. ఆ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది 13 మందిని రక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్