Kota: కోటా హాస్టల్లో అగ్నిప్రమాదం..7గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
రాజస్థాన్, కోటాలోని కున్హాడీ వద్ద ఉన్న ఓ హాస్టల్లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
కోటా: రాజస్థాన్, కోటాలోని కున్హాడీ వద్ద ఉన్న ఓ హాస్టల్లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాన్స్ఫార్మర్లో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లుగా అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో హాస్టల్లోని 61 గదుల్లో సుమారుగా 75 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటన ఉదయం 6గంటలకు చోటుచేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్లోని ట్రాన్స్ఫార్మర్ పేలడంతో మంటలు నిమిషాల్లో హాస్టల్లోని మూడు అంతస్తులకు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు, పొగలు వ్యాపించడంతో భయభ్రాంతులకు గురైన విద్యార్థులు తప్పించుకోవడానికి పరుగులు పెట్టారు. మరికొందరు విద్యార్థులు తమను తాము రక్షించుకోవడానికి మొదటి, రెండో అంతస్తులోని బాల్కనీ నుంచి దూకడంతో గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మిగిలిన విద్యార్థులను రక్షించారు. అగ్నిమాపక యంత్రాలు 3గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశాయి.
ఆరుగురు విద్యార్థులకు కాలిన గాయాలవ్వగా, ఓ విద్యార్థి మొదటి అంతస్తు బాల్కనీ నుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. స్వల్పగాయాలతో బయట పడిన వారికి ప్రాథమిక చికిత్స అందించామన్నారు. ‘హాస్టల్లో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్ లేకపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. మెట్ల నుంచి దిగి తప్పించుకునే ప్రయత్నంలో చాలా మంది గాయపడ్డారు. హాస్టల్ యజమాని నరేష్ ధాఖర్, డైరెక్టర్ హితేష్ జైన్లను అదుపులోకి తీసుకున్నాం. తదుపరి విచారణ కొనసాగుతోంది’ అని పోలీసు అధికారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల