Andhra news: 28 ఏళ్లనాటి శిరోముండనం కేసు.. నేటితో విచారణ పూర్తి

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెంలో 1996 డిసెంబరు 29న జరిగిన శిరోముండనం కేసులో విచారణ బుధవారం పూర్తయింది.

Updated : 03 Apr 2024 20:48 IST

విశాఖపట్నం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో 1996 డిసెంబరు 29న జరిగిన శిరోముండనం కేసులో విచారణ బుధవారం పూర్తయింది. ఏప్రిల్‌ 12న తీర్పు వెలువరిస్తామని విశాఖ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తెలిపారు.

రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ కేసులో ప్రధాన నిందితుడు కాగా, మరో 8 మంది నిందితులు ఉన్నారు. ప్రధాన సాక్షి కోటి రాజు (58) ఇటీవల మృతిచెందారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రధాన బాధితుడు కోటి చినరాజుకు ఆయన సోదరుడు. బాధితులు ఐదుగురిలో ఇద్దరు మరణించారు. గత ఏడాది బాధితుడు పువ్వల వెంకటరమణ మృతిచెందారు. 15 మంది సాక్షుల్లో ఇద్దరు చనిపోయారు. శిరోముండనం కేసు నమోదై 28 సంవత్సరాలు కావడంతో దళితులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. 12న వెలువడే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని