Crime: అబ్బాయి పుడతాడో లేదో తెలుసుకోవాలని భార్య కడుపు కోశాడు..నిందితుడికి జైలు శిక్ష
భార్య కడుపులో ఉన్నది మగా, ఆడ తెలుసుకోవడానికి ప్రయత్నించిన ఓ కిరాతకుడికి ఉత్తరప్రదేశ్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.
లఖ్నవూ: భార్య కడుపులో ఉన్నది మగబిడ్డా, ఆడబిడ్డా తెలుసుకోవడానికి ప్రయత్నించిన ఓ కిరాతకుడికి ఉత్తరప్రదేశ్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్లోని బదౌన్కు చెందిన పన్నాలాల్ కు ఐదుగురు సంతానం. వారంతా ఆడపిల్లలే కావడంతో అతడు తనకు కుమారుడు కావాలని భార్యను తరచూ హింసించేవాడు. తనకు కుమారుడిని ఇవ్వకపోతే విడాకులు ఇచ్చి మరొకరిని వివాహం చేసుకుంటానని బెదిరించేవాడు.
మరోసారి గర్భిణి అయిన తన భార్య అనిత మగబిడ్డకు జన్మనిస్తుందో, లేదోననే ఆలోచనతో ఆమెతో రోజూ గొడవకు దిగేవాడు. ఓ రోజు బిడ్డ విషయంలో గొడవ జరగ్గా కడుపులో ఉన్నది మగ బిడ్డేనా, లేదా అని తెలుసుకోవడానికి కొడవలితో ఆమె కడుపును చీల్చాడు. దాంతో నొప్పి భరించలేక కేకలు వేస్తూ అనిత బయటకు పరిగెత్తింది. సమీపంలో ఉన్న బాధితురాలి సోదరుడు ఆమె అరుపులు విని ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే అనితను ఆసుపత్రికి తరలించాడు. దాడి జరిగిన సమయంలో బాధితురాలు ఎనిమిది నెలల గర్భిణి అని, ఆమె కడుపులో ఉన్న మగబిడ్డ చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. పరారీలో ఉన్న నిందితుడు పన్నాలాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2020 సెప్టెంబర్లో ఈ సంఘటన జరగ్గా ఈ కేసులో నిందితుడికి న్యాయస్థానం తాజాగా జీవిత ఖైదు విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?