Palnadu: పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
పల్నాడు జిల్లాలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు భారీగా కేసులు నమోదు చేస్తున్నారు.
అమరావతి: పల్నాడు జిల్లాలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు భారీగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం, వైకాపా వర్గీయులపై వందల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. దాడులు, ఘర్షణలకు సంబంధించిన వీడియోల సాయంతో నిందితులను గుర్తిస్తున్నారు. పోలీసుల తీరుపై తెలుగుదేశం కార్యకర్తల కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘర్షణల సమయంలో తమ వారు అక్కడ లేపోయినా అన్యాయంగా కేసుల్లో ఇరికించారని ఆరోపిస్తున్నారు.
- గురజాల నియోజకవర్గంలో 100 కేసులు నమోదు చేసి 192 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. దాచేపల్లి మండలంలో 70, పిడుగురాళ్ల మండలంలో 62 మందిపై కేసులు పెట్టారు. మరో 67మందిపై ఐపీసీ 307, 324, 323 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
- సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు..70 మంది నిందితులను గుర్తించారు.
- పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదు కేసులు..99 మంది నిందితులను గుర్తించారు.
- నరసరావుపేట నియోజకవర్గంలో 20 కేసులు నమోదు చేసి..60 మందిని నిందితులుగా చేర్చారు. మరో 11 మందిపై ఐపీసీ 147, 148, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
- మాచర్లలో అత్యధికంగా హింసాత్మక ఘటనలు జరిగినప్పటికీ కేసుల విషయంలో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్నారు.
- పల్నాడు జిల్లా కారంపూడిలో ఈనెల 14న జరిగిన దాడులు, హింసాత్మక ఘటనలకు సంబంధించి అరెస్టులు మొదలయ్యాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కారంపూడిలో తెదేపా కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు, ప్రైవేటు ఆస్తులపై దాడులు చేశారు. కొన్ని వాహనాలను తగులబెట్టారు. ప్రతి చర్యగా తెదేపా వర్గీయులు రోడ్లపైకి వచ్చి వైకాపాకు చెందిన వారి ఆస్తులపై దాడులు చేశారు. ఈ రెండు ఘటనలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. వైకాపాకు చెందిన 11 మందిని, తెదేపాకు చెందిన 8మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుమార్తెను కాపాడే క్రమంలో తండ్రి మృత్యువాత
అప్పటి దాకా సరదాగా గడిపిన ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.. జలాశయంలో పడిపోయిన కుమార్తెను రక్షించబోయిన తండ్రి మృతి చెందడం వారిని ఆవేదనలో ముంచెత్తింది. -
దారితప్పిన కూతురు... తండ్రిపాలిట మృత్యువు
తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటున్నారన్న కోపంతో కన్నతండ్రిపైనే దాడి చేసి కడతేర్చిందా కుమార్తె. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ నెల 13న జరిగిన హత్య కేసు వివరాలను డీఎస్పీ ప్రసాదరెడ్డి సోమవారం వెల్లడించారు. -
తాడిపత్రిలో తెదేపా కార్యకర్త హత్య
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తాడిపత్రి ప్రజలు ఈ హత్యతో మళ్లీ ఉలిక్కిపడ్డారు. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం..
పెళ్లి చేసుకుందామనుకున్న ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. -
ఎక్స్ప్రెస్ రైలును ఢీకొట్టిన గూడ్సు
పశ్చిమ బెంగాల్లో సోమవారం ఘోర రైలుప్రమాదం చోటుచేసుకుంది. దార్జీలింగ్ జిల్లాలోని రంగాపానీ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కంచన్జంగా ఎక్స్ప్రెస్ను.. వేగంగా దూసుకొచ్చిన ఓ గూడ్సు రైలు బలంగా వెనక నుంచి ఢీకొట్టింది. -
పిచ్చికుక్క దాడిలో పసికందు దుర్మరణం
తల్లిపాలు తాగి అప్పుడే నిద్రలోకి జారుకున్న పసికందును పిచ్చికుక్క రూపంలో వచ్చిన మృత్యువు కాటేసింది. కన్నపేగు తెంచుకొని పుట్టిన పసిగుడ్డు కళ్లముందే విలవిల్లాడుతోంటే ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. -
ఝార్ఖండ్లో ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల మృతి
ఝార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఒక మహిళతో సహా మొత్తం ఐదుగురు మావోయిస్టులు మరణించారని, మరో ఇద్దరు అరెస్టయ్యారని అధికారులు తెలిపారు. -
బీమా కొత్తకొత్తగా.. కసరత్తులో యంత్రాంగం
చిరుజల్లులు కురవగానే రైతన్నలు సంతోషంతో పొలం పనులు ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. విత్తనాలు వేయడం మొదలు శ్రమిస్తారు. ప్రకృతి వైపరీత్యాలకు చేతికి వచ్చే దశలో పంటలు నాశనమవుతున్నాయి.