కాకినాడ రైల్వే స్టేషన్లో వైద్య విద్యార్థిని దుర్మరణం
నగరంలోని రైల్వేస్టేషన్లో రైలు దిగేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడి వైద్య విద్యార్థిని మృతి చెందింది.
కాకినాడ టౌన్ : ప్రమాదవశాత్తూ రైలు పట్టాలపై పడి వైద్య విద్యార్థిని దుర్మరణం పాలైన ఘటన గురువారం ఉదయం కాకినాడ రైల్వే స్టేషన్లో జరిగింది. కాకినాడ జీఆర్పీ ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ఎస్.సత్య తనూష(24) గుంటూరు జిల్లా చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఈనెల 10 నుంచి మూడు రోజుల పాటు సదస్సు ఉండటంతో పాల్గొనేందుకు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి శేషాద్రి ఎక్స్ప్రెస్లో కాకినాడ చేరుకుంది.
రెండో నంబరు ప్లాట్ఫాం వద్ద రైలు దిగేందు సిద్ధమవుతుండగా పట్టు తప్పి పట్టాలపై పడిపోయింది. రైలు పోర్టు రైల్వేస్టేషన్ వైపు నెమ్మదిగా కదలడంతో.. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు, ప్రయాణికులు గట్టిగా కేకలు వేసి చైన్లాగారు. వెంటనే రైలు ఆగినప్పటికీ.. అప్పటికే ప్లాట్ఫాం, రైలు చక్రాల మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2 కోట్ల విలువైన మద్యం పట్టివేత
ఎన్నికల వేళ అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.2 కోట్ల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ ఠాణాలో సీఐ నాగార్జునగౌడ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు పట్టా అందుకున్న కొద్ది రోజులకే మృత్యువాత పడిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. -
రేవణ్న లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల అదుపులో దేవరాజ గౌడ
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి వీడియోను లీక్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో నిందితుడు, ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న భాజపా నేత దేవరాజ గౌడను చిత్రదుర్గం జిల్లా హిరియూరు గ్రామీణ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. -
ఇసుక లారీ ఢీ.. ఇద్దరు ప్రయాణికుల మృతి
బస్షెల్టర్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై శనివారం సాయంత్రం ఇసుక లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు, ఐఈడీ పేలి బాలిక మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతరి, బీజాపూర్ జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ మావోయిస్టు, మరో బాలిక మృతి చెందారు. దంతరి జిల్లా బైసాముండా గ్రామ శివారు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.