Crime: Crime: నా భర్తను చంపితే.. ₹50వేలు రివార్డు ఇస్తా: ఓ మహిళ వాట్సప్‌ స్టేటస్‌!

భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ మహిళ తన భర్తను చంపిన వారికి రూ.50వేలు రివార్డుగా ఇస్తానని వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటించిన ఘటన యూపీలోని ఆగ్రా జిల్లాలో వెలుగుచూసింది.

Published : 01 Apr 2024 00:06 IST

ఆగ్రా: భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ మహిళ తన భర్తను చంపిన వారికి రూ.50వేలు రివార్డుగా ఇస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ఆమె వాట్సప్ స్టేటస్‌లో పెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. భార్య స్టేటస్ చూసి భయపడిన భర్త తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించాడు. రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. 2022లో తమకు వివాహం కాగా, కొద్ది  కాలానికే గొడవలు మొదలయ్యాయని తెలిపాడు. అప్పటి నుంచి తన భార్య ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటుందని, ఆ తర్వాత తనను చంపేందుకు కుట్ర పన్నిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమ మధ్య వచ్చిన వివాదాలకు తన అత్తమామల పక్కింట్లో ఉంటున్న వ్యక్తే కారణమని ఆరోపించాడు. తన భార్యకు అతడితో వివాహేతర సంబంధం ఉందని, అతడు పలు మార్లు తనకు ఫోన్‌ చేసి చంపుతానని బెదిరించాడని పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు