ACB Raids: ఏసీబీ వలలో ఏసీపీ
హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ టి.ఎస్.ఉమామహేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కారు. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్ అశోక్నగర్లోని ఏసీపీ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఉమామహేశ్వరరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
రూ.37.5 లక్షల నగదు, 60 తులాల నగలు లభ్యం
రెండు బ్యాంకు లాకర్లు, 17 ప్రాంతాల్లో స్థిరాస్తుల గుర్తింపు
స్వాధీనం చేసుకున్న నగదు కట్టలు, నగలు, ఉమామహేశ్వరరావు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ టి.ఎస్.ఉమామహేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కారు. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్ అశోక్నగర్లోని ఏసీపీ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని 14 చోట్ల ఏకకాలంలో మరిన్ని బృందాలు సోదాలు జరిపాయి. ఉమామహేశ్వరరావు సోదరుడితోపాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఇవి కొనసాగాయి. సోదాల్లో భారీగా రూ.500 నోట్ల కట్టలను, ఆభరణాలను, 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను గుర్తించారు. ఇప్పటివరకు విశ్లేషించిన సమాచారం మేరకు ఆదాయానికి మించిన ఆస్తుల విలువ రూ.3.46 కోట్ల వరకు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రెట్టింపు ఉంటుందని భావిస్తున్నారు. సోదాలను అనిశా సంయుక్త సంచాలకుడు సుధీంద్ర పర్యవేక్షించారు. బుధవారం ఉమామహేశ్వరరావును న్యాయస్థానంలో ప్రవేశపెడతామని, ఎఫ్ఎంసీజీ పెట్టుబడుల కేసులోనూ అక్రమాలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
కళ్లు చెదిరే ఆస్తుల చిట్టా
ఏసీబీ బృందాలు మంగళవారం రాత్రి 9గంటల వరకు చేసిన సోదాల్లో లభించిన సమాచారం మేరకు... మొత్తం రూ.37.5 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలు, హైదరాబాద్ శివార్లు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఘట్కేసర్లో ఐదుచోట్ల, విశాఖపట్నం, చోడవరంలలో ఏడుచోట్ల, శామీర్పేట, మల్కాజిగిరి, కూకట్పల్లిల్లో ఒక్కోటి చొప్పున స్థలాలు, శామీర్పేటలో ఖరీదైన విల్లా ఉన్నట్లు గుర్తించారు. రెండు బ్యాంకు లాకర్లు ఉన్నట్లు తేల్చారు. దర్యాప్తు ముగిస్తే ఆస్తుల చిట్టా పెరిగే అవకాశముందన్నారు. స్థిరాస్తి సంస్థ సాహితీ ఇన్ఫ్రా మోసానికి సంబంధించిన కేసును ఉమామహేశ్వరరావు దర్యాప్తు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల పలు వెంచర్లలో వందల మంది వినియోగదారుల నుంచి ప్రీలాంచ్ ఆఫర్ల పేరిట రూ.2000 కోట్లు వసూలు చేసి, ఫ్లాట్లు ఇవ్వలేదని, కొన్నింటికి డబుల్ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆ సంస్థపై అభియోగం. ‘సాహితి’ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణతోపాటు ఆయన కుటుంబ సభ్యులపైనా హైదరాబాద్ సీసీఎస్లో కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు చేసిన ఉమామహేశ్వరరావు... సంస్థ నిర్వాహకులతో అంటకాగారనే విమర్శలు వచ్చాయి. భారీగా ముడుపులు తీసుకుని, ఉల్టా బాధితులనే బెదిరించారనే ఆరోపణలు వినిపించాయి. దాంతో పలువురు బాధితులు ఉమామహేశ్వరరావు అక్రమాస్తులపై ఆరా తీసి, ఏసీబీకి సమాచారం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
ఉమామహేశ్వరరావు ఇంట్లో లభించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, డైరీలో సందీప్ అనే పేరును అధికారులు గుర్తించారు. అతనితో కలిసి ఉమామహేశ్వరరావు వ్యాపార, స్థిరాస్తి లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూశాఖ దస్త్రాల దహనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. -
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ