Road Accident: అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

అల్లూరి జిల్లా అరకు లోయ మండలం మాదాల పంచాయతీ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.

Updated : 08 Mar 2024 23:48 IST

అరకు: అల్లూరి జిల్లాలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు బైక్‌లు ఢీ కొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. అరకులోయ మండలం మాదాల పంచాయతీ దుమ్మగుడ్రి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాల గురించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని