Tirumala: తిరుమల ఘాట్‌రోడ్‌లో ప్రమాదం.. మహిళ మృతి

తిరుమల మొదటి ఘాట్‌రోడ్‌లో జరిగిన ప్రమాదంలో ఓ మహిళా భక్తురాలు మృతి చెందింది. 

Published : 30 Mar 2024 21:01 IST

తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌రోడ్‌లో జరిగిన ప్రమాదంలో ఓ మహిళా భక్తురాలు మృతి చెందింది. ఏనుగుల ఆర్చి సమీపంలో  కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకొని చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బెంగళూరుకి చెందిన భవాని మృతి చెందింది. అశ్వని ఆసుపత్రిలో బాధిత కుటుంబాన్ని ఈవో ధర్మారెడ్డి పరామర్శించారు. శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని