Vijayawada: పెళ్లికి నిరాకరించడంతో మహిళపై యాసిడ్ దాడి
తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించటంతో ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో చోటుచేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
గాయాలపాలైన బాధితురాలు
నందిగామ, న్యూస్టుడే: తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించటంతో ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో చోటుచేసుకుంది. ఐతవరానికి చెందిన ఓ మహిళకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా.. పది నెలల క్రితం భర్త మృతిచెందాడు. నెల్లూరు జిల్లా రాజేంద్రనగర్ కుక్కలగుంటకు చెందిన ఆటో డ్రైవర్ రాసింగారం మణిసింగ్తో పరిచయం ఏర్పడింది. అప్పటికే అతడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పుడప్పుడు నెల్లూరు నుంచి వచ్చి వెళ్తుండేవాడు. ఇటీవల మణిసింగ్కు టి.బి. రావటంతో ఆమె దూరం పెట్టింది. వివాహం చేసుకుందామని కోరినా నిరాకరించింది. ఈ క్రమంలో శనివారం రాత్రి యాసిడ్ బాటిల్తో ఐతవరం వచ్చిన నిందితుడు.. ఆమె ఇంట్లోనే నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంటి బయటకు వచ్చాడు. ఆమె తిరిగి ఇంట్లోకి వెళ్లేటప్పుడు వెనకనుంచి యాసిడ్ పోశాడు. బాధితురాలితో పాటు ఆరేళ్ల కుమారుడు, అక్క కుమార్తెపైన యాసిడ్ పడటంతో వారికీ స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలిని నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి గొల్లపూడిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆమెకు 20% కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. నందిగామ ఏసీపీ, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధితురాలిని పరామర్శించారు.
నిందితుడి అరెస్టు
విజయవాడ నేరవార్తలు, న్యూస్టుడే: యాసిడ్ దాడికి పాల్పడిన మణిసింగ్(34)ను అరెస్టు చేసినట్లుకమిషనర్ కాంతిరాణా టాటా వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం కమిషనర్ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఫేస్బుక్ ద్వారా నిందితునికి మహిళతో పరిచయం ఏర్పడినట్టు తెలిపారు. బాధితురాలికి ఐసీడీఎస్ ద్వారా నష్టపరిహారం అందేలా కలెక్టర్తో మాట్లాడతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు