Teen Stabbed: నిశ్చితార్థం రద్దయ్యిందని.. యువతిని చంపేశాడు!

తనతో నిశ్చితార్థం రద్దయ్యిందన్న ఆగ్రహంతో ఓ యువతిని కత్తితో పొడిచి హత్య చేశాడో యువకుడు. గురుగ్రాంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 11 Jul 2023 02:28 IST

చండీగఢ్‌: హరియాణా (Haryana)లో దారుణం చోటుచేసుకుంది. యువతితో తన నిశ్చితార్థం (Engagement) రద్దయ్యిందన్న ఆగ్రహంతో ఓ యువకుడు ఆమెను కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)కు చెందిన ఓ యువతి(19)కి నాలుగు నెలల క్రితం రాజ్‌కుమార్‌(23) అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. అయితే, పలు కారణాల వల్ల ఇటీవల అది రద్దయ్యింది. ఇదంతా మనసులో పెట్టుకున్న అతను ఆమెపై పగ పెంచుకున్నాడు.

ఈ క్రమంలోనే.. ఆ యువతి ఓ మహిళతో కలిసి సోమవారం గురుగ్రాం ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుండగా మాట కలిపాడు. అంతలోనే దాడికి దిగి.. కత్తితో పలుమార్లు పొడిచాడు. పక్కనే ఉన్న మహిళ ఆమెను రక్షించేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనా సమయంలో పలువురు అక్కడే ఉన్నా.. ఎవరూ అతన్ని అడ్డుకోలేక పోవడం గమనార్హం. వారంతా పారిపోతున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డయ్యింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని