Hyderabad: ఉప్పల్‌ భగాయత్‌లో భాజపా నేతపై కత్తులతో దాడి

ఉప్పల్‌ భగాయత్‌లో భాజపా నేత, రాష్ట్ర స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కన్వీనర్‌ ఉదయ్ భాస్కర్‌ గౌడ్‌పై దాడి జరిగింది.

Updated : 24 Feb 2024 22:20 IST

హైదరాబాద్‌: ఉప్పల్‌ భగాయత్‌లో భాజపా నేత, రాష్ట్ర స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కన్వీనర్‌ ఉదయ్ భాస్కర్‌ గౌడ్‌పై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఉదయ్‌ భాస్కర్‌ నేరుగా ఉప్పల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. దీంతో పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించగా.. ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. బోడుప్పల్‌కు చెందిన ఉదయ్ భాస్కర్ గౌడ్ మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారితో పరిచయాలు ఉన్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు