Hyderabad: హోటల్‌లో రౌడీషీటర్ల వీరంగం.. సామగ్రి ధ్వంసం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలోని ఓ హోటల్‌లో రౌడీషీటర్లు వీరంగం సృష్టించారు.

Updated : 03 Mar 2024 19:07 IST

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలోని ఓ హోటల్‌లో రౌడీషీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్‌ సామగ్రితో పాటు పార్కింగ్‌ వద్ద బైక్‌లను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో నమోదయ్యాయి. ఈ ఘటనపై అత్తాపూర్‌ పోలీసు స్టేషన్‌లో హోటల్‌ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని