Siddipet: బిల్లు కట్టలేదని విద్యుత్‌ కనెక్షన్‌ తొలగింపు.. లైన్‌మెన్‌పై హత్యాయత్నం

బిల్లు కట్టలేదని ఇంటికి విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన జూనియర్‌ లైన్‌మెన్‌పై పెట్రోల్‌ పోసి హత్యాయత్నం చేయడం కలకలం రేపింది.

Updated : 01 Jul 2023 18:19 IST

గజ్వేల్‌: బిల్లు కట్టలేదని ఇంటికి విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన జూనియర్‌ లైన్‌మెన్‌పై పెట్రోల్‌ పోసి హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని కాసారం గ్రామంలో నాంపల్లి నరేశ్‌ జూనియర్‌ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కరుణాకర్‌ అనే వ్యక్తికి సంబంధించి రెండు నెలల విద్యుత్‌ బిల్లు బకాయి ఉంది. అతడికి విద్యుత్‌ అధికారులు బిల్లు చెల్లించాలని సూచించారు. అయినా.. చెల్లించకపోవడంతో జూనియర్‌ లైన్‌మెన్‌ నరేశ్‌ స్తంభం ఎక్కి.. విద్యుత్‌ సరఫరా నిలిపివేసి కిందికి దిగాడు. దీంతో ఆగ్రహించిన కరుణాకర్‌ ద్విచక్రవాహనంలో నుంచి పెట్రోల్‌ తీసి నరేశ్‌పై పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో కరుణాకర్‌ భార్య అడ్డు పడటంతో తన ప్రాణాలు దక్కాయని నరేశ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై తోటి ఉద్యోగులతో కలిసి నరేశ్‌ గజ్వేల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని