Gurugram: వేడినీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి...

వేడినీటి బకెట్‌లో పడి రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన గురుగ్రామ్‌లోని దమ్‌దామాధాని గ్రామంలో చోటుచేసుకుంది.

Published : 23 Feb 2024 23:05 IST

గురుగ్రామ్: వేడినీటి బకెట్‌లో పడి రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన గురుగ్రామ్‌లోని దమ్‌దామా ధాని (Damdama Dhani) గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల  వివరాల మేరకు...  బాలుడి తల్లి ఇంట్లో వేడినీళ్లు బకెట్‌లో పోసివుంచి పని చేసుకుంటుండగా ఆ పక్కనే ఉన్న రెండున్నరేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బకెట్ లో పడిపోయాడు. కొద్ది సేపటికి చిన్నారి వేడినీళ్లలో పడిపోయాడని గుర్తించి బయటకు తీసేలోపే తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడని ఇన్‌స్పెక్టర్ సురేందర్ కుమార్ తెలిపారు. కుటుంబసభ్యుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు