Hyderabad: బజాజ్ ఎలక్ట్రానిక్స్లో 432 ఫోన్లు చోరీ.. కేసును ఛేదించిన పోలీసులు
గత నెల 21న నగరంలోని ఈసీఐఎల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్లో జరిగిన చోరీ కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు.
హైదరాబాద్: గత నెల 21న నగరంలోని ఈసీఐఎల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్లో జరిగిన చోరీ కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మొత్తం రూ.70లక్షల విలువైన 432 మొబైల్ ఫోన్లను దుండగులు చోరీ చేసినట్లు ఘటన తర్వాత బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్ మేనేజర్ పోలీసుల ఫిర్యాదు చేశారు. వీటిలో ఐఫోన్, ఒప్పో, వన్ప్లస్, వివో బ్రాండ్లకు చెందిన స్మార్ట్ఫోన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై వివిధ కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు.. ఝార్ఖండ్కు చెందిన షేక్ సత్తార్, అసీదుల్ షేక్ను గుర్తించి అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది.
చోరీ చేసిన స్మార్ట్ఫోన్లను నిందితులు బంగ్లాదేశ్కు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. బంగ్లాదేశ్ సరిహద్దుకు 3 కి.మీ దూరంలో నివసించే ముఠా ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బ్యాంకులు, మొబైల్ షాపులు, జ్యూవెలరీ షాపుల్లో చోరీ చేయడంలో ఈ ముఠా ఆరితేరినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు షేక్ సత్తార్, అసీదుల్ షేక్ నుంచి రెండు మొబైల్ఫోన్లు, రూ.80వేల నగదు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు