Bus Driver: ప్రాణాలు పోతున్నా.. 48 మందిని కాపాడాడు
ఓ వైపు తన ప్రాణం పోతున్నా.. సమయస్ఫూర్తితో వ్యవహరించిన బస్సు డ్రైవర్ 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు.
భువనేశ్వర్: విధి నిర్వహణలో తన ప్రాణం పోతున్నా.. అతను కర్తవ్యాన్ని మరువలేదు. గుండెల్లో తీవ్రమైన నొప్పి.. భరించలేని బాధ వేధిస్తున్నా.. తనను నమ్మి బస్సు ఎక్కిన వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడాడు. ఒడిశాలోని ఓ బస్సు డ్రైవర్కు గుండె పోటు వచ్చింది. ఆ సమయంలో అతడు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో 48 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. కంధమాల్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన ఓ బస్సు ఒడిశాలోని కంధమాల్ జిల్లా శరణ్ఘర్ నుంచి 48 మంది ప్రయాణికులతో భువనేశ్వర్కు బయల్దేరింది. బస్సు కంధమాల్ జిల్లా పబురియా గ్రామానికి చేరుకునే సరికి డ్రైవర్ సనా ప్రధాన్కు ఛాతీలో తీవ్రమైన నొప్పి మొదలైంది. క్రమంగా నొప్పి ఎక్కువ అయ్యింది. అయితే.. బస్సుపై నియంత్రణ కోల్పోకుండా.. కొద్ది దూరం వెళ్లాక బస్సును ఆపేందుకు రోడ్డు పక్కనే ఉన్న గోడకు ఢీకొట్టాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత డ్రైవర్ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కార్డియాక్ అరెస్ట్తో డ్రైవర్ మృతి చెందినట్లు తెలిపారు. ఓ పక్క ప్రాణాలు పోతున్నా.. సరైన సమయంలో బస్సును ఆపి తమకు ప్రాణభిక్ష పెట్టాడని ప్రయాణికులు డ్రైవర్ తెగువను కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయి స్వాధీనం
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన నిందితుడు కస్టడీలో ఆత్మహత్య
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో అరెస్టైన నిందితుల్లో ఒకరు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. -
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడి మృతి
ఐస్గా భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు
తెలంగాణ మావోయిస్టులకు ఛత్తీస్గఢ్లో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. -
ఫోన్ లాక్కొన్నారు.. అడ్డగిస్తే కత్తులతో పొడిచారు
చేతిలో ఉన్న ఫోన్ను లాక్కొని పోతున్న వారిని పట్టుకోబోయిన యువకుడిని నిందితులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన విషాదకర ఘటన హైదరాబాద్ గుడిమల్కాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. -
సైబర్ నేరగాళ్ల చేతికి ‘మ్యూల్ ఖాతాలు’
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న పెద్ద ముఠాలో కీలక సభ్యుడైన ఓ యువకుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?