Cambodia job scam: మోసం చేయడమే ఉద్యోగం
సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. మిత్రుడు అజయ్ సూచనతో జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన సాయిప్రసాద్ అనే ఏజెంట్ను కలిశాడు.
ఒప్పుకోకుంటే బెదిరింపులు, దాడులు
పాస్పోర్టు లాక్కొని రోజుకు 15-16 గంటల పని
ఉపాధి కోసం వెళ్లి కంబోడియా ముఠాల చెరలో చిక్కిన బందీల దుస్థితి
ఈనాడు, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. మిత్రుడు అజయ్ సూచనతో జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన సాయిప్రసాద్ అనే ఏజెంట్ను కలిశాడు. రూ.1.4లక్షలు తీసుకున్న సాయిప్రసాద్.. మరో ముగ్గురితో కలిసి శివను గత జనవరిలో కంబోడియాకు పంపించాడు. నెలకు 950 యూఎస్ డాలర్ల వేతనంతో ఉద్యోగం అని చెప్పాడు. తాను సైబర్ నేరస్థుల ముఠా చేతిలో బందీగా మారానని అక్కడికి వెళ్లాకగానీ శివ తెలుసుకోలేకపోయారు. అతడి పాస్పోర్టు లాక్కొని బలవంతంగా సైబర్ నేరాలు చేయించిందా ముఠా. మూడునెలల తర్వాత శివ అదను చూసి భారత రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేసి అక్కడి అధికారుల సహకారంతో బయటపడగలిగారు. ఇక్కడికి వచ్చాక సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏజెంట్లను అరెస్ట్ చేశారు. అదే క్యాంపులో తెలుగువారు సహా వందల మంది భారత యువకులున్నారు. ఇటీవలే బందీలు తెగించి శిబిరాల నుంచి బయటికి వచ్చి కంబోడియాలో ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం విశాఖపట్నానికి చెందిన 24 మంది యువకులు తిరిగి స్వస్థలాలకు వచ్చారు. అక్కడ ఇంకా క్యాంపులున్నాయనే సమాచారంతో తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్ సీఎస్బీ) తాజాగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వియత్నాం సరిహద్దుల్లో శిబిరాలు
విదేశీ సైబర్ నేరగాళ్ల ముఠాలు సామాజిక మాధ్యమాల్లో ఆకర్షణీయ ప్రకటనలిస్తూ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. వాటిని చూసి ఏజెంట్లు సంప్రదిస్తున్నారు. తమ కంపెనీల్లో ఉద్యోగావకాశాలున్నాయని.. యువకుల్ని పంపిస్తే భారీమొత్తంలో కమీషన్ ఇస్తామని ఆశపెడుతున్నారు. వారి మాటలు నమ్మిన ఏజెంట్లు.. ఉద్యోగావకాశాల కోసం తమ వద్దకు వచ్చే యువతను విదేశాలకు పంపిస్తున్నారు. అలా కంబోడియాకు వచ్చే యువకులను ముఠా సభ్యులు శిబిరాలకు తరలించి పాస్పోర్టులను స్వాధీనం చేసుకుంటున్నారు. అక్కడ కొద్దిరోజులపాటు సైబర్ నేరాలు ఎలా చేయాలనే అంశంపై శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వీరితోనే ఫోన్లు చేయించి మోసాలు చేయిస్తున్నారు. ఒప్పుకోకుంటే బెదిరింపులకు పాల్పడటంతోపాటు పలు సందర్భాల్లో తీవ్రంగా కొడుతున్నారు. ఒక్కో క్యాంపులో 500-600 మందితో ఇలా మోసాలు చేయిస్తున్నారు. అలాంటివి కంబోడియాలో పలుచోట్ల ఉన్నట్లు.. ముఖ్యంగా వియత్నాం సరిహద్దుల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ముఠాల వెనక చైనా దేశీయుల హస్తముందని సమాచారం.
రూ.500 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు గుర్తింపు
ఒకసారి శిబిరంలోకి ప్రవేశించాక తిరిగి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. సైబర్ నేరాలు చేసే క్రమంలో బృందాలుగా విడగొడుతున్నారు. ఒక బృందం బాధితుల్ని వలలో వేసుకుంటే.. బాధితుల నుంచి డబ్బులు రాబట్టే పనిని మరో బృందంతో చేయిస్తున్నారు. ఎక్కువగా భారతీయులనే లక్ష్యంగా చేసుకొని ఈ నేరాలు చేయిస్తున్నారు. బాధితులు తెలుగువారైతే ఆ భాషలోనే మాట్లాడాలని ఆదేశాలిస్తున్నారు. ఒక్కొక్కరితో రోజుకు 15-16 గంటలపాటు పనిచేయిస్తున్నారు. ఫెడెక్స్ కొరియర్, స్టాక్మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించిన మోసాలు చేయిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అలా చేసినందుకు వేతనం ఇస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక కొందరు యువకులు.. ఒకవేళ ఎంబసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిస్తే ఏమవుతుందోననే భయంతో మరికొందరు శిబిరాల్లోనే మగ్గిపోతున్నారు. ఈ మోసాలపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు అందుతుండటంతో కేంద్రహోంశాఖ, విదేశీ వ్యవహారాలశాఖ, ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) ప్రత్యేక దృష్టి సారించాయి. భారత్లోని బాధితుల నుంచి రూ.500కోట్ల వరకు కొల్లగొట్టినట్లు ప్రాథమికంగా సమాచారం సేకరించారు. అక్కడి శిబిరాల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల యువకులున్నట్లు వెల్లడి కావడంతో కంబోడియాలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వితంతువైన వదినతో పెళ్లి.. కాల్చిచంపిన ఇతర సోదరులు
వితంతురాలైన వదినను పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని అతడి మిగతా సోదరులు కాల్చి చంపిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బాగ్పత్ గ్రామంలో వెలుగు చూసింది. -
రీల్స్ మోజులో ఇద్దరు బాలురి దుర్మరణం
స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి బయటకు వచ్చిన ముగ్గురు బాలురు స్కూటీపై ప్రయాణిస్తూనే సెల్ఫోన్లో రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. -
ఉపాధి లేక... పూట గడవక..!
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. పైగా ఆరు నెలలుగా పనిలేదు. పూట గడవని దుస్థితితో కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక కుంగిపోయిన ఓ చేనేత కార్మికుడు రైలు కిందపడి ప్రాణం తీసుకున్నారు. -
మావోయిస్టుల భారీ కుట్ర భగ్నం
ఇన్ఫార్మర్లు, పోలీసులే లక్ష్యంగా మందుపాతరలు అమర్చేందుకు యత్నించిన మావోయిస్టుల భారీ కుట్రను ములుగు జిల్లా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. -
విమానాల్లో టక్కరి దొంగ
విమానాల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఘరానా కేటుగాడు ఆర్జీఐఏ పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానాల్లో వెళ్తూ ఆరు చోరీలు చేసిన అతడి నుంచి కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది. దీంతో ఆదివాసీ పల్లెల్లో భయానక వాతావరణం నెలకొంది. -
గోవుల రవాణా నేపథ్యంలో ఘర్షణ
గోవుల రవాణాను కొందరు అడ్డుకోవడంతో మొదలైన గొడవ.. చినికి చినికి గాలివానగా మారి ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో మెదక్ పట్టణంలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. -
బవారియా గ్యాంగ్ పంజా
నగరంపై ఉత్తరప్రదేశ్కు చెందిన భవారియా గ్యాంగ్ పంజా విసిరింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు వరుసగా నాలుగు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. -
కన్నకొడుకే కాలయముడు
ఆ తల్లిదండ్రుల పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు.. కనిపెంచిన వారిని కిరాతకంగా డబ్బు కోసం అంతమొందించాడు.. -
గుండె కుడివైపు ఉందని భార్యను వదిలేసిన భర్త
ఓ యువతిని పెళ్లాడిన వ్యక్తి ఆమెకు గుండె కుడి వైపు ఉందనే కారణంతో వదిలేశాడు. న్యాయపోరాటం చేయడంతో ప్రతినెలా మనోవర్తి చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్
-
పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం: మంత్రి నారాయణ
-
సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
-
విచారణ పూర్తికాకముందే తీర్పు ఎలా ఇస్తారు?: జగదీశ్ రెడ్డి
-
‘నీట్’ వివాదం.. సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి: సిబల్
-
రుషికొండపై రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా