రైల్లో వివాదం.. ఇద్దరిపై చాకుతో దాడి.. పరిస్థితి విషమం
గాంధీ ధామ్- పూరి ధామ్ రైళ్లో ఒకే బోగీలో ప్రయాణిస్తున్న వారి మధ్య గురువారం రాత్రి ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
కటక్: గాంధీ ధామ్- పూరి ధామ్ రైళ్లో ఒకే బోగీలో ప్రయాణిస్తున్న వారి మధ్య గురువారం రాత్రి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ కొట్లాటలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి. చంద్రశేఖర్రావు, అతడి స్నేహితుడు బ్రహ్మపురానికి చెందిన నాగేశ్వర బెహరాకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరినీ ఒడిశాలోని బలంగిర్ జిల్లా టిటిలాగాడ్ రైల్లే స్టేషన్లో దింపేసి.. రైల్వే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ స్నేహితులిద్దరూ రైల్లో ఏదో విషయంపై ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన దంపతులు చాగల నాయక్, వినతి నాయక్లోమ గొడవపడ్డారు. దీంతో దంపతులిద్దరూ ఆగ్రహంతో వారి దగ్గరున్న చాకుతో వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో వారిద్దరి గొంతులపై తీవ్ర గాయాలయ్యాయి. బోగీలో ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించడంతో క్షతగాత్రులను తొలుత టిటిలాగాడ్లోని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బలంగిర్ భీమా బోయి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
సైబర్ నేరగాళ్ల చేతికి ‘మ్యూల్ ఖాతాలు’
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న పెద్ద ముఠాలో కీలక సభ్యుడైన ఓ యువకుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. -
రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయి స్వాధీనం
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన నిందితుడు కస్టడీలో ఆత్మహత్య
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో అరెస్టైన నిందితుల్లో ఒకరు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. -
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడి మృతి
ఐస్గా భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు
తెలంగాణ మావోయిస్టులకు ఛత్తీస్గఢ్లో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. -
ఫోన్ లాక్కొన్నారు.. అడ్డగిస్తే కత్తులతో పొడిచారు
చేతిలో ఉన్న ఫోన్ను లాక్కొని పోతున్న వారిని పట్టుకోబోయిన యువకుడిని నిందితులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన విషాదకర ఘటన హైదరాబాద్ గుడిమల్కాపూర్ ఠాణా పరిధిలో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు