Crime news: కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
హుబ్బళ్లి: కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఘోరం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ నిరంజన్ హిరేమఠ్ కుమార్తెను ఓ యువకుడు కత్తితో పొడిచి హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది. బీవీబీ కళాశాల క్యాంపస్లోకి కత్తితో చొరబడిన నిందితుడు.. కార్పొరేటర్ కుమార్తె నేహా (23)పై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నేహా ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతుండగా.. నిందితుడు ఫయాజ్ (23) ఎంసీఏ డ్రాపవుట్ అని సమాచారం. బీసీఏ కోర్సు చదువుతున్న సమయంలో వీళ్లిద్దరూ ఒకే బ్యాచ్కు చెందినవారిగా గుర్తించారు.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కత్తితో క్యాంపస్లోకి ప్రవేశించిన ఫయాజ్.. నేహాపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అదే సమయంలో అతడికి కూడా గాయాలయ్యాయి. దీంతో ఇద్దరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే నేహా మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తామిద్దరం ప్రేమించుకున్నామని, అకస్మాత్తుగా తనను దూరం పెట్టిందని చెప్పాడని పోలీసులు తెలిపారు. అయితే, అతడు చెప్పిన విషయాలను ధ్రువీకరించుకోవాల్సి ఉందన్నారు. నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పుల కారణంగా మానసికంగా కుంగిపోయిన ఓ వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లలను, కన్నతల్లిని కడతేర్చి తానూ ఉరివేసుకుని తనువు చాలించారు. -
ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూఝ్మడ్ అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. -
టమాటా పెట్టెల చాటున తెలంగాణ మద్యం రవాణా
తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న నిందితులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పోలీసులు అరెస్టు చేశారు. -
మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు, ట్రక్కు ఢీ
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఓ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. -
సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి పేరుతో నకిలీ ఖాతాలు
తన పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.