Crime news: కాలేజీ క్యాంపస్‌లో ఘోరం.. కార్పొరేటర్‌ కుమార్తె దారుణ హత్య

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్‌ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

Published : 19 Apr 2024 00:16 IST

హుబ్బళ్లి: కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఘోరం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్‌ నిరంజన్‌ హిరేమఠ్‌ కుమార్తెను ఓ యువకుడు కత్తితో పొడిచి హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది. బీవీబీ కళాశాల క్యాంపస్‌లోకి కత్తితో చొరబడిన నిందితుడు.. కార్పొరేటర్‌ కుమార్తె నేహా (23)పై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నేహా ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతుండగా.. నిందితుడు ఫయాజ్‌ (23) ఎంసీఏ డ్రాపవుట్‌ అని సమాచారం. బీసీఏ కోర్సు చదువుతున్న సమయంలో వీళ్లిద్దరూ ఒకే బ్యాచ్‌కు చెందినవారిగా గుర్తించారు. 

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కత్తితో క్యాంపస్‌లోకి ప్రవేశించిన ఫయాజ్‌.. నేహాపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అదే సమయంలో అతడికి కూడా గాయాలయ్యాయి. దీంతో ఇద్దరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే నేహా మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తామిద్దరం ప్రేమించుకున్నామని, అకస్మాత్తుగా తనను దూరం పెట్టిందని చెప్పాడని పోలీసులు తెలిపారు. అయితే, అతడు చెప్పిన విషయాలను ధ్రువీకరించుకోవాల్సి ఉందన్నారు. నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని