Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘాతుకం.. పోలీసును నరికి చంపిన దుండగులు

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని సుక్మా ప్రాంతంలో కొందరు దుండగులు ఒక పోలీసును అతి దారుణంగా చంపేశారు. 

Published : 03 Jun 2024 11:32 IST

రాయ్‌పుర్: నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని సుక్మాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఒక కానిస్టేబుల్‌ను హత్య చేశారని ఉన్నతాధికారులు వెల్లడించారు.

మృతుడి పేరు సోడి లక్ష్మణ్‌ అని అధికారులు వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడి జరిగిందని చెప్పారు. గాదిరాస్ గ్రామంలో జరిగిన జాతర చూసేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై.. కొందరు వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోగా.. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ‘‘నక్సలైట్ల బృందం ఈ ఘటనకు పాల్పడి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. అయితే ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు చేన్నాం. వ్యక్తిగత శత్రుత్వం ఏమైనా కారణమా..? అన్న కోణంలో కూడా విచారిస్తున్నాం’’ అని వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు