East Godavari: భర్త మృతదేహం పక్కనే ప్రాణాలు విడిచిన భార్య

అనారోగ్యంతో భర్త మృతి చెందగా .. మనోవేదనతో భార్య కూడా ప్రాణాలు విడిచింది.

Updated : 18 Feb 2024 16:52 IST

గోకవరం: అనారోగ్యంతో భర్త మృతి చెందగా .. మనోవేదనతో భార్య కూడా ప్రాణాలు విడిచింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ వృద్ధ దంపతులిద్దరూ మృతి చెందిన విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో చోటు చేసుకుంది.  గ్రామానికి చెందిన కోసూరి సత్యనారాయణ (77) వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు, కుమార్తెకు వివాహాలు జరిపించారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యనారాయణ ఆదివారం తెల్లవారుజూమున మృతి చెందాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన భార్య వరలక్ష్మి (65) భర్త మృతదేహం పక్కనే ఏడుస్తూ ప్రాణాలు విడిచింది. ఎంతో అన్యోన్యంగా జీవించిన భార్యాభర్తలు ఒకే సారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని