crime news: చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య
తాజాగా వైరలైన తమ చిన్నారికి సంబంధించిన వీడియోపై నెటిజన్ల విమర్శలను తట్టుకోలేని ఓ మహిళ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల చెన్నైలోని ఓ అపార్ట్మెంట్ పైకప్పు ప్లాస్టిక్ షీట్కు ఓ చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ ఉన్న వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనలో స్థానికులు చిన్నారిని కాపాడారు. స్థానికులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో చిన్నారి ప్రాణాలు దక్కాయి. ఇదే ఘటనపై నెటిజన్లు వ్యవహరించిన తీరు ఇప్పుడా బిడ్డకు తల్లిని దూరం చేసింది. నెట్టింట విమర్శలు తట్టుకోలేక ఆ చిన్నారి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
చెన్నైలోని ఓ అపార్ట్మెంట్లో ఇంటి పైకప్పుపై ప్రమాదకరంగా వేలాడుతున్న చిన్నారిని కుటుంబ సభ్యులు, స్థానికులు ఇటీవల కాపాడారు. పైకప్పు కింద ఉన్న కిటికీలోంచి బయటకు వచ్చి శిశువును రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాపను రక్షించిన వారిని ప్రశంసించిన నెటిజన్లు.. చిన్నారి తల్లి విషయంలో దూషణలకు దిగారు. పాపను అలా నిర్లక్ష్యంగా వదిలేసినందువల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ ఆరోపించారు. ఈ విషయంలో స్థానికులు ఆమెకు అండగా నిలిచారు. తన బిడ్డను బాగా చూసుకుంటుందని, అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతుంటాయని బాసటగా నిలిచారు.
ఈ ఘటన అనంతరం చిన్నారి తల్లి కొయంబత్తూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆదివారం ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ కారణంగా ఆమె మానసికంగా కుంగిపోయిందని, దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై సింగర్ చిన్మయి (Chinmayi) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కొందరు నెటిజన్లు విచక్షణ మరిచి చేసిన వ్యాఖ్యల వల్లే ఆ పసికందు తల్లి ఆత్మహత్య చేసుకుందన్నారు. ‘మీ ట్రోల్స్ వల్ల చిన్నారి తల్లి మరణించింది. ఇప్పుడు మీ కళ్లు చల్లబడ్డాయా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్పీ కార్యాలయం వద్ద జరిగింది. -
వడదెబ్బతో ఆరుగురి మృత్యువాత
రాష్ట్రంలో వడదెబ్బకు గురై శనివారం ఆరుగురు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మధ్యాహ్నం వేళ గుర్తుతెలియని వ్యక్తి(35) ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందారు. -
హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ సూత్రధారి అరెస్ట్
కేరళ కిడ్నీ రాకెట్ కేసులో కీలక నిందితుడిని కేరళ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. బల్లంకొండ రాంప్రసాద్ అలియాస్ ప్రసాద్(41)ను ఎర్నాకుళం రూరల్ జిల్లా ఎస్పీ వైభవ్ సక్సేనా నేతృత్వంలోని పోలీస్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) హైదరాబాద్లో అదుపులో తీసుకొంది. -
ఆరేళ్ల అనంతరం నిందితుడి అరెస్ట్
విదేశాల్లో ఉద్యోగం కోసం జాబ్ వీసా ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కేసులో నిందితుడిని ఆరేళ్ల తర్వాత తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఒంగోలులో దారుణం.. కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి
జీతం వచ్చిన రోజే డబ్బులడిగాడనే ఆగ్రహంతో కన్న కుమారుడిని తుపాకీతో ఓ తండ్రి కాల్చి చంపాడు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ వయసు చిన్నదే.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాలి : హర్దీప్ సింగ్
-
దోషిగా తేలడం మెలానియాకు మింగుడు పడలేదు: ట్రంప్
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్
-
తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
-
రెండు రోజుల్లో కౌంటింగ్.. ఈసీ తలుపుతట్టిన అధికార, విపక్షాలు
-
ఎగ్జిట్ పోల్స్కి విలువ లేదు.. మమత రియాక్షన్ ఇదే!