ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ మృతి

ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ శేషగిరిరావు మృతిచెందారు. 

Updated : 24 Apr 2024 17:02 IST

చర్ల: ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ శేషగిరిరావు మృతిచెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81వ బెటాలియన్‌లో చోటు చేసుకుంది. సమీపంలోని అడవిలో కూంబింగ్‌కు శేషగిరిరావు వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆయన వద్ద ఉన్న ఏకే 47 తుపాకీ పేలి ఛాతీ కింది భాగంగాలో తూటా దిగింది. అపస్మారక స్థితికి చేరుకున్న శేషగిరిని మిగిలిన జవాన్లు బేస్‌ క్యాంప్‌ వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి 73 కి.మీ దూరంలోని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతిచెందారు. శేషగిరి ఏపీలోని అనంతపురం జిల్లా వాసిగా తెలిసింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని