Cyber Crime: మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల కొత్త పంథా
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా కొంతమంది వీరి ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ యువతి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. మహారాష్ట్ర పోలీసులమంటూ సైబర్ నేరగాళ్లు ఆమెకు ఫోన్ చేశారు. మనీలాండరింగ్ కేసులో మీ పేరుందని చెప్పి.. స్కైప్ ద్వారా వీడియో కాల్లో మాట్లాడారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే తాము చెప్పిన ఖాతాకు రూ.60లక్షలు నగదు బదిలీ చేయాలని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే చేసిన తర్వాత మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు.. వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు స్పందించి మొత్తం నగదును ఫ్రీజ్ చేశారు. వేగంగా స్పందించిన కాల్ సెంటర్ సిబ్బందిని అదనపు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. -
లంచం డబ్బు వదిలి.. పరుగో పరుగు..!
దొంగలు పరుగెత్తడం.. వారిని పట్టుకోవడానికి పోలీసులు వెంటాడడం సాధారణమే. లంచం తీసుకున్న ఒక పోలీసు ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులను చూసి.. నడిరోడ్డుపై పరిగెత్తగా వారు వెంటాడి పట్టుకున్న సంఘటన గురువారం హైదరాబాద్లో చోటుచేసుకుంది. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై లారీ, కంటైనర్ ఢీకొన్నాయి. -
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ
మచిలీపట్నం నుంచి బీదర్ వెళ్తున్న బీదర్ ఎక్స్ప్రెస్, తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ రైళ్లలో బుధవారం అర్ధరాత్రి సమయంలో దోపిడీలు జరిగాయి. -
సినీనటుడు పృథ్వీరాజ్పై అరెస్టు వారెంట్
భార్యకు మనోవర్తి చెల్లింపు కేసులో న్యాయస్థానం ఎదుట గైర్హాజరైన సినీ నటుడు పృథ్వీరాజ్పై విజయవాడ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. -
‘కూలి’న బతుకులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రహరీ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందడం విషాదం నింపింది. -
ఏపీ, ఒడిశా నుంచి తరలిస్తున్న 930 కిలోల గంజాయి పట్టివేత
ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి తీసుకువచ్చిన 930 కిలోల గంజాయిని నొయిడా, గ్రేటర్ నొయిడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లబజారులో రూ.4 కోట్లు విలువ చేసే ఈ సరకుకు సంబంధించి రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురిని అరెస్టు చేశారు. -
పోలీసుల అదుపులో ఆరుగురు మావోయిస్టులు..!
ములుగు జిల్లా వెంకటాపురంలో పోలీసులు బుధవారం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. -
బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు
బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన పేలుడులో ఆరుగురు దుర్మరణం చెందిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: హరోం హర.. సుధీర్బాబు ఖాతాలో హిట్ పడిందా?
-
మరికాసేపట్లో తెలంగాణ ఐసెట్ ఫలితాలు.. ఈనాడు.నెట్లో రిజల్ట్స్ ..
-
తొలి బంతికే విరాట్ వికెట్.. అదొక భావోద్వేగ క్షణం: సౌరభ్ నేత్రవల్కర్
-
తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?
-
డెలివరీ పార్ట్నర్స్కు సీపీఆర్లో శిక్షణ.. జొమాటోకు గిన్నిస్ రికార్డ్
-
ఇకపై జమ్మూకశ్మీర్ పాఠశాలల్లో జాతీయ గీతం తప్పనిసరి