Crime: పదో అంతస్తు పైనుంచి దూకి.. ఐఏఎస్ అధికారుల కుమార్తె ఆత్మహత్య

మహారాష్ట్ర కేడర్ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల కుమార్తె పదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబయిలో జరిగింది.

Published : 03 Jun 2024 21:34 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)  కేడర్ ఐఏఎస్ అధికారు(IAS Officers)ల కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా శాఖలో ప్రధాన కార్యదర్శి వికాస్ రస్తోగి, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ ఐఏఎస్ అధికారి రాధిక రస్తోగిల కుమార్తె లిపి(27) సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాష్ట్ర సచివాలయ సమీప భవనంలోని పదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. 

 లిపి హరియాణాలోని సోనిపట్‌లో ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తోంది. ఆమె వద్ద సూసైడ్ నోట్‌ లభ్యమైందని అందులో తన మరణానికి ఎవరూ కారణం కాదని రాసి ఉందని పోలీసులు తెలిపారు. దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

2017లో ఇదేవిధంగా మహారాష్ట్రలోని ఐఏఎస్ అధికారులు మిలింద్, మనీషా మహీస్కర్‌ల 18 ఏళ్ల కుమారుడు ముంబయిలోని తాము నివాసం ఉంటున్న  భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని