Mahabubabad: జిల్లా కోర్టు సంచలన తీర్పు.. బాలుడి హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష

మహబూబాబాద్‌ జిల్లాలో మూడేళ్ల క్రితం సంచలనం రేపిన బాలుడి హత్యోదంతం కేసులో న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది.

Updated : 29 Sep 2023 15:33 IST

మహబూబాబాద్: మహబూబాబాద్‌ జిల్లాలో మూడేళ్ల క్రితం సంచలనం రేపిన బాలుడి హత్యోదంతం కేసులో న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. 

మహబూబాబాద్‌లోని కృష్ణకాలనీకి చెందిన కుసుమ వసంత, రంజిత్‌ రెడ్డిల పెద్ద కుమారుడు దీక్షిత్‌ రెడ్డి(9)..2020 అక్టోబర్ 18న అపహరణకు గురయ్యాడు. దీక్షిత్‌ రెడ్డిని సాగర్‌ అనే యువకుడు కిడ్నాప్‌ చేసి.. గుట్టల్లోకి తీసుకెళ్లి టీషర్టు మెడకు బిగించి హత్య చేశాడు. డబ్బు కోసమే బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నిందితుడికి మరణ శిక్ష విధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని