Crime news: తప్పతాగి తరగతి గదిలోనే నగ్నంగా పడకేసిన ప్రధానోపాధ్యాయుడు!
ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) ఓ ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో పాఠశాలకు వెళ్లాడు. దీంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.
లఖ్నవూ : గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ బాధ్యతగా మెలగాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు (Head master) తప్పతాగి పాఠశాలకు వెళ్లాడు. అంతేకాదు తరగతి గదిలోనే సోయి లేకుండా నగ్నంగా నిద్రపోయాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం బహ్రైచ్ జిల్లాలోని శివపుర్ బైరాగి ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విశేశ్వరగంజ్ బ్లాక్లోని శివపుర్ బైరాగి ప్రాథమిక పాఠశాలలో దుర్గా ప్రసాద్ జైశ్వాల్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజులు క్రితం అతడు ఫూటుగా మద్యం సేవించి పాఠశాలకు వెళ్లాడు. దుస్తులన్నీ విప్పేసి విద్యార్థుల ముందే నగ్నంగా నిద్రపోయాడు. ఆ సమయంలో ప్రధానోపాధ్యాయుడి ప్రవర్తనను కొందరు గ్రామస్థులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వైరల్గా మారింది. తీరా ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రధానోపాధ్యాయుడి సస్పెండ్ చేశారు.
గొంతుకోసి.. కారంపొడి చల్లి.. మహిళా డాక్టర్ దారుణ హత్య
దుర్గా ప్రసాద్ జైశ్వాల్ అనుచిత ప్రవర్తన గురించి తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. నిందితుడు తరచూ ఇలాగే చేస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ చేష్టలను భరించలేక కొందరు బాలికలు పాఠశాలకు వెళ్లడం మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో బేసిక్ శిక్ష అధికారి (బీఎస్ఏ) ఉపాధ్యాయుడిపై విచారణకు ఆదేశించారు. వెంటనే బ్లాక్ విద్యాధికారి అతడిని సస్పెండ్ చేశారు. ‘దుర్గా ప్రసాద్పై మాకు ఫిర్యాదు అందింది. విశేశ్వరగంజ్ బ్లాక్లోని శివపుర్ బైరాగి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన అతడు మద్యం మత్తులో పాఠశాలకు వెళ్తున్నట్లు తెలిసింది. అనుచిత ప్రవర్తనకు సంబంధించిన వైరలవున్న వీడియోను ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రాథమిక విచారణ అనంతరం అతడిపై చర్యలు తీసుకున్నామని, అవసరమైతే పోలీసుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం’ అని బీఎస్ఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.