Bitcoin Ponzi Scam: బిట్కాయిన్ పెట్టుబడుల పేరుతో ₹6,600 కోట్ల మోసం
బిట్కాయిన్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ప్రజల నుంచి రూ.6,600 కోట్లు వసూలు చేసిన కేసులో ముంబయికి చెందిన సింపీ భరద్వాజ్ అనే మహిళను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
దిల్లీ: బిట్కాయిన్ (Bitcoin)లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ముంబయికి చెందిన సింపీ భరద్వాజ్ అనే మహిళను అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం కేసుకు సంబంధించిన వివరాలను ఈడీ వెల్లడించింది.
ముంబయికి చెందిన ‘వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు సింపీ భరద్వాజ్ ఆమె భర్త అజయ్ భరద్వాజ్తోపాటు.. అమిత్ భరద్వాజ్, వివేక్ భరద్వాజ్, మహేందర్ భరద్వాజ్ అనే వ్యక్తులు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ ‘గెయిన్ బిట్కాయిన్ పోంజీ స్కీమ్’ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బిట్కాయిన్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ-లెవల్ మార్కెటింగ్ (MLM) పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబయి, దిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ.6,600 కోట్లు వసూలు చేశారు. ఈ మొత్తాన్ని విదేశాల్లోని పలు సంస్థల ఖాతాలకు బదిలీ చేశారు. అనంతరం ఆ డబ్బుతో విదేశాల్లో పెద్ద ఎత్తున స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
ఈ సంస్థ మోసాలపై దిల్లీ, ముంబయిలో పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. దిల్లీ, ముంబయిలోని సంస్థ ప్రమోటర్ల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఖరీదైన మూడు లగ్జరీ కార్లు, రూ.18.91 లక్షల నగదు, రూ.69 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా సింపీ భరద్వాజ్, అజయ్ భరద్వాజ్, మహేందర్ భరద్వాజ్లను పేర్కొంటూ, వారిపై నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసింది. ఇందులో సింపీ భరద్వాజ్ను డిసెంబరు 17న ముంబయిలో అరెస్టు చేసి, మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టగా డిసెంబరు 26 వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. మరో ఇద్దరు నిందితులు అజయ్, మహేందర్లు పరారీలో ఉన్నట్లు ఈడీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్