Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్- బస్తర్- దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో గురువారం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఏడుగురు మావోయిస్టుల మృతి
ఈ ఏడాది ఇప్పటివరకూ 112 మంది హతం
దుమ్ముగూడెం, న్యూస్టుడే: ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్- బస్తర్- దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో గురువారం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో ప్లాటూన్ నంబరు-16, ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈక్రమంలో కేంద్ర పారామిలిటరీ బలగాలతోపాటు డీఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. ఓర్చా పోలీస్స్టేషన్ పరిధిలోని రేకవాయి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో గాలింపు నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు ప్రతిస్పందించి ఎదురు కాల్పులకు దిగాయి. గురువారం రాత్రి వరకూ పరస్పరకాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడినట్లు పోలీస్ అధికారులు భావిస్తున్నారు. మృతి చెందిన వారిని గుర్తించేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన 7 ఆయుధాలను, భారీ ఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో కలిపి ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది ఇప్పటివరకూ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 112కి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి