Fake Notes: ₹41లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం
రూ.41లక్షలకు పైగా విలువ చేసే నకిలీ కరెన్సీ నోట్లను టాస్క్ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు.
భువనేశ్వర్: ఒడిశాలోని సోనేపూర్లో భారీగా నకిలీ నోట్లు పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. అతడి నుంచి రూ.41.16లక్షల విలువ చేసే నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందం సీజ్ చేసిన ₹500 కరెన్సీ నోట్లన్నీ నిజమైన నోటుకు ఉండాల్సిన సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉన్నట్టు తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తిని దీపక్ మెహర్గా గుర్తించారు.
నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నకిలీ కరెన్సీ నోట్లను పరీక్షించేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్కు పంపారు. అయితే, ఈ నకిలీ నోట్లు ఛత్తీస్గడ్ నుంచి తరలిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొందరిని పట్టుకొనేందుకు చర్యలు చేపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
సైబర్ నేరగాళ్ల చేతికి ‘మ్యూల్ ఖాతాలు’
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న పెద్ద ముఠాలో కీలక సభ్యుడైన ఓ యువకుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. -
రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయి స్వాధీనం
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన నిందితుడు కస్టడీలో ఆత్మహత్య
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో అరెస్టైన నిందితుల్లో ఒకరు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. -
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడి మృతి
ఐస్గా భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు
తెలంగాణ మావోయిస్టులకు ఛత్తీస్గఢ్లో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. -
ఫోన్ లాక్కొన్నారు.. అడ్డగిస్తే కత్తులతో పొడిచారు
చేతిలో ఉన్న ఫోన్ను లాక్కొని పోతున్న వారిని పట్టుకోబోయిన యువకుడిని నిందితులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన విషాదకర ఘటన హైదరాబాద్ గుడిమల్కాపూర్ ఠాణా పరిధిలో జరిగింది.