Hyderabad: రాజేంద్రనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.2కోట్ల ఆస్తి నష్టం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ గగన్‌ పహాడ్‌ పారిశ్రామిక వాడలో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

Updated : 29 Nov 2023 18:24 IST

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ గగన్‌ పహాడ్‌ పారిశ్రామిక వాడలో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. థర్మాకోల్‌ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. వెల్డింగ్‌ పనులు చేస్తుండగా.. విద్యుత్‌ తీగల నుంచి మంటలు అంటుకుని ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని, రూ.2కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేయడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై శంషాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని