Crime News: వాగులో స్నానానికి దిగి ఇద్దరు హైదరాబాద్‌ వాసుల మృతి

పట్టణ శివారులోని నల్లమడ వాగులో స్నానానికి దిగి ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు.

Updated : 29 May 2024 15:18 IST

బాపట్ల: పట్టణ శివారులోని నల్లమడ వాగులో స్నానానికి దిగి ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఆరుగురు బుధవారం ఉదయం పర్యటక కేంద్రం సూర్యలంక బీచ్‌కు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారు నల్లమడ వాగులో స్నానానికి దిగారు. తొలుత ప్రవాహ ఉద్ధృతికి ఒకరు కొట్టుకుని పోయారు. అతడిని రక్షించే క్రమంలో మిగతా ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సన్నీ, సునీల్ మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన గిరి, నందు కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని