Crime: గుడిసెల్లోకి దూసుకెళ్లిన బస్సు..నలుగురు కూలీల మృతి
గుడిసెల్లో నిద్రిస్తున్న కూలీల పైకి ప్రైవేటు బస్సు దూసుకెళ్లడంతో నలుగురు కూలీలు మృతి చెందిన ఘటన గోవాలో చోటుచేసుకుంది.
గోవా: రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోకి బస్సు దూసుకెళ్లడంతో నలుగురు కూలీలు మృతి చెందిన ఘటన శనివారం అర్థరాత్రి దక్షిణ గోవాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం వెర్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్ (Verna Industrial Estate) వద్ద వలస కూలీలు వారి గుడిసెల్లో నిద్రిస్తుండగా అర్థరాత్రి 11.30గంటల సమయంలో ఓ బస్సు గుడిసెల పైకి దూసుకొచ్చింది. దీంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గయపడిన మరో ఐదుగురిని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
ఘటన జరిగిన సమయంలో తనకు ఫోన్ రావడంతో గుడిసెలో నుంచి బయటకు వచ్చానని తాను చూస్తుండగానే బస్సు వేగంగా వచ్చి రెండు గుడిసెల్లోకి దూసుకెళ్లిందని రూపేందర్ మాథుర్ అనే కూలీ తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమన్నారు. ఘటనలో తన సోదరుడు, మామ ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని డ్రైవర్ బెదిరించినట్లుగా వాపోయాడు. బాధితులకు చికిత్స చేయడంలో వైద్య సిబ్బంది జాప్యం చేయడంతో క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ను అరెస్టు చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంటల వ్యవధిలో అల్లుడు, అత్త మృతి
గంటల వ్యవధిలో గుండెపోటుతో అల్లుడు, అత్త మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలంలో చోటుచేసుకుంది. -
మాదాపూర్లో యువకుడి అనుమానాస్పద మృతి
నగరంలోని మాదాపూర్లో సాయి అనే యువకుడు అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. అయ్యప్ప సొసైటీలోని ఓ హోటల్ ఆరో అంతస్తు పైనుంచి పడి మరణించాడు. -
ఏనుగు దాడిలో వృద్ధుడి దుర్మరణం.. చిత్తూరు జిల్లాలో ఘటన
ఏనుగు దాడిలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పీయం తండాలో చోటుచేసుకుంది. కుప్పం ఎఫ్ఆర్వో జయశంకర్ వివరాల మేరకు.. తండాకు చెందిన కన్నానాయక్(65) శనివారం రాత్రి పశువులను కట్టేసేందుకు కొట్టంలోకి వెళ్లారు. -
హత్యకు దారి తీసిన ఘర్షణ
అప్పు చెల్లించే విషయంలో జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం పడాల గ్రామం విజయదుర్గ ఆలయం పక్క రోడ్డులో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో కొప్పర్తి రాంబాబు -
ఫైనాన్స్ వాహనాలే లక్ష్యంగా మోసాలు
-
ఘర్షణ ఘటనలో 14 మంది అరెస్టు
గోవుల రవాణా నేపథ్యంలో శనివారం రాత్రి మెదక్లో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఘటనను నిరసిస్తూ ఆదివారం పట్టణ బంద్కు ఓ వర్గం పిలుపునిచ్చింది. -
నాన్న.. రావా..
కుటుంబ సభ్యులంతా శుభకార్యానికి హాజరయ్యారు.. తిరిగి వెళుతూ రోడ్డు ప్రమాదంలో కళ్లెదుట తండ్రి మృతిచెందారు.. అప్పటి వరకు సంతోషంగా గడిపిన నాన్న.. విగతజీవిగా ఉండటంతో పిల్లలిద్దరి రోదనలు మిన్నంటాయి. -
చికెన్ ఇవ్వలేదని వ్యక్తి దారుణ హత్య
చికెన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిని మద్యం మత్తులో మరో వ్యక్తి బండరాయితో మోది హత్య చేసిన ఘటన హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఫిలిప్పీన్స్ నౌకను ఢీకొన్న చైనా కోస్ట్గార్డ్ ఓడ..!
-
అప్పుడు టెస్లా కార్లనూ హ్యాక్ చేయొచ్చేమో: మస్క్కు రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్
-
11 మంది ఆటను నేను ఆడలేను కదా.. టీమ్గా విఫలమయ్యాం: బాబర్ అజామ్
-
కొన్ని నెలల్లో ఐపీఓల సందడి.. రూ.50 వేల కోట్ల సమీకరణ!
-
నెల్లూరు జిల్లాలో కారుపై పెద్దపులి దాడి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM