Tragedy: సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతుండగా షార్ట్‌సర్క్యూట్‌.. ఒకే ఇంట్లో నలుగురు చిన్నారుల మృతి

ఓ ఇంట్లో మొబైల్ ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతుండగా షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగిన ఘటన పెను విషాదం నింపింది.

Published : 24 Mar 2024 15:29 IST

మేరఠ్‌: సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతుండగా షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పెను విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ విషాదం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగింది. మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతుండగా షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగి బెడ్‌షీట్‌కు అంటుకున్నట్లు మృతి చెందిన చిన్నారుల తండ్రి జానీ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను సారిక (10), నిహారిక (8), శంకర్‌ (6), కలు(4)గా గుర్తించారు. కూలీ పనిచేస్తున్న జానీ ఈ ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడగా.. అతడి భార్య బబితకు తీవ్ర గాయాలవ్వడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను మెరుగైన వైద్యం కోసం దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని