విషజ్వరంతో మృతి
మండలంలోని సంగాయిగూడేనికి చెందిన గెడ శ్రీవల్లీ సాహితి (22) విష జ్వరంతో మృతి చెందింది.
శ్రీవల్లీ సాహితి (పాత చిత్రం)
దేవరపల్లి: మండలంలోని సంగాయిగూడేనికి చెందిన గెడ శ్రీవల్లీ సాహితి (22) విష జ్వరంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీవల్లీ సాహితి ఐదు రోజుల క్రితం జ్వరంతో దేవరపల్లి, నిడదవోలు ప్రైవేటు ఆసుపత్రిల్లో చికిత్స పొందింది. ఆరోగ్యం విషమించడంతో రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా గురువారం రాత్రి మృతి చెందింది. సంగాయిగూడేనికి చెందిన గెడ రాజు, నారాయణ దంపతులకు ఏకైక కుమార్తె శ్రీవల్లీ. తండ్రి అనారోగ్యంతో 8 సంవత్సరాల క్రితమే మృతి చెందారు. తల్లిని కంటికి రెప్పలాగా చూసుకుంటూ డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తోంది. కూతురు కోసం జీవిస్తున్న నారాయణకు ఆమె కూడా చనిపోవడంతో ఆమె రోధించినతీరు వర్ణనాతీతం.
దారిదోపిడీ, హత్యాయత్నం కేసులో నిందితులకు ఏడేళ్ల జైలు
రాజానగరం, న్యూస్టుడే: దారి దోపిడీ, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ కాగిత సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసులో ఆరోపణలు రుజువుకావడంతో నిందితులు ద్వార ప్రకాష్ అలియాస్ పంతులు, గుర్రాల సాయితేజలకు రాజానగరం మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎస్.ప్రవీణ్కుమార్ ఒక్కొక్కరికీ ఏడేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారని సీఐ పి.కాశీవిశ్వనాథం శుక్రవారం విలేకరులకు తెలిపారు. నల్లజర్ల మండలం చాదరసిగుంట గ్రామానికి చెందిన సత్యనారాయణ 2016 ఏప్రిల్లో ఇనుప సామగ్రి కొనుగోలుకు టాటాఏస్ వాహనంలో కొంతమూరు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తూ గామన్ ఇండియా వంతెనపై రాత్రి సమయంలో వాహనాన్ని ఆపి నిద్రిస్తుండగా రాజమహేంద్రవరానికి చెందిన నిందితులు ప్రకాష్, సాయితేజలు సత్యనారాయణపై దోపిడీ, హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుపై అప్పటి సీఐ శంకరనాయక్ కేసు నమోదు చేసి నిందితులను కటకటాల వెనక్కి పంపారు. దర్యాప్తు అనంతరం వారిపై అభియోగపత్రం దాఖలు చేశారు. వాదోపవాదాలు పూర్తయ్యాక అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎస్.ప్రవీణ్కుమార్ పైవిధమైన శిక్ష విధించారని సీఐ కాశీవిశ్వనాథం తెలిపారు. ఈ కేసును అదనపు పీపీ వెంకటరత్నం బాబు వాదించగా, కోర్టు కానిస్టేబుల్ ఎల్.దుర్గాప్రసాద్ సాక్షులను సకాలంలో హాజరుపరిచారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!