తండ్రీకొడుకుల మృతితో పుట్లగట్లగూడెంలో విషాదం
రోడ్డు ప్రమాదంలో గంటల వ్యవధిలో తండ్రీకొడుకులు మృతిచెందడంతో వారి స్వగ్రామం జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది.
బాధిత కుటుంబానికి న్యాయం కోరుతూ గ్రామస్థుల ధర్నా
జంగారెడ్డిగూడెం, జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్టుడే: రోడ్డు ప్రమాదంలో గంటల వ్యవధిలో తండ్రీకొడుకులు మృతిచెందడంతో వారి స్వగ్రామం జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. గురవాయిగూడెం వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గంటా తేజ(14) ఏలూరులో చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం చనిపోయిన విషయం విదితమే. మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించిన తేజ తండ్రి వెంకన్న(40) బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. కొద్ది గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులు దుర్మరణం చెందడంతో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ తేజ మృతదేహంతో ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం పుట్లగట్లగూడెం గ్రామస్థులు సుమారు గంటన్నర పాటు ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న సీఐ బాలసురేష్, లక్కవరం, జంగారెడ్డిగూడెం ఎస్సైలు దుర్గామల్లేశ్వరరావు, సాగర్బాబు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ప్రమాద ఘటనకు సంబంధించి వెంకన్న భార్య పెద్దింట్లు ఫిర్యాదు మేరకు లక్కవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దింట్లు, వెంకన్న దంపతులకు ఇద్దరు కుమారులు. మట్టి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో కుటుంబానికి ఆధారమైన భర్త, చిన్న కుమారుడిని కోల్పోవడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పెద్ద కుమారుడు పవన్ పదో తరగతి చదువుతున్నాడు.
మృతదేహంతో ధర్నా చేస్తున్న గ్రామస్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.